ఒలంపిక్స్ కోసం స్పెషల్ ఎడిషన్!

లండన్లో నిర్వహించనున్న ఒలంపిక్స్ 2012 క్రీడా పోటీలను పురస్కరించుకుని ఏసర్ స్పెషల్ ఎడిషన్ టాబ్లెట్ కంప్యూటర్ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. పేరు ‘ఏసర్ ఐకోనియా ఏ510’. వచ్చే నెలనాటికి ఈ స్పెషల్ ఎడిషన్ డివైజ్ యూకె మార్కెట్లో లభ్యం కానుంది. ఈ స్పెషల్ ఎడిషన్ గ్యాడ్జెట్ పై ఐదు ఒలంపిక వృత్తాలను డిజైన్ చేశారు. ఈ డిజైన్ యూజర్లలో ఒలంపిక్ క్రీడా స్పూర్తిని రెట్టింపు చేస్తుంది. డివైజ్లో లోడ్ చేసిన ట్రెయిల్ వర్షన్ యూరో స్పోర్ట్ ఛానల్ అప్లికేషన్ క్రీడాభిమానులకు మరింత లబ్ధి చేకూరుస్తంది. ఈ ఫీచర్ సౌలభ్యతతో యూజర్లు ఆటలకు సంబంధించి ప్రత్యక్ష లైవ్ కవరేజ్ను ఆస్వాదింవచ్చు. ఈ స్పెషల్ ఎడిషన్ టాబ్లెట్ ధర విషయానికొస్తే రూ.28,000గా అంచనా వేస్తున్నారు.
టాబ్లెట్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే:
ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెడ్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఆడియో ప్లేయర్,
వీడియో ప్లేయర్,
వై-ఫై,
బ్లూటూత్,
యూఎస్బీ కనెక్టువిటీ.
ఒలంపిక్స్ స్పెషల్ ఎడిషన్ ఏసర్ ఐకోనియా ఏ510 టాబ్లెట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంభినేషన్లో డిజైన్ కాబడింది. అత్యాధునిక హంగులతో యూకె మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ స్మార్ట్ కంప్యూటింగ్ డివైజ్ టెక్నాలజీ ఆరాధికుల మదిలో ఒలంపిక్స్ పట్ల ఆసక్తిని రగిలించాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications








