మోడ్రెన్ పల్లెకు, ‘రిలయన్స్’ నాంది!!

By Super
|
reliance netbook
సాంకేతిక విప్లవంలో భాగంగా ‘రిలయన్స్’ ఓ కొత్త ఒరవడికి నాంది పలకింది. ఇప్పటికే టెలికమ్యూనికేషన్, పెట్రోలియం, ఎడ్యూకేషన్, మొబైల్ ఆప్లికేషన్, 3జీ నెట్‌వర్కింగ్ రంగాల్లో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చకున్న అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్, అతి తక్కువ ధరకే ల్యాపీ పరికరాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.

రూ.500లకే సెల్‌ఫోన్ పరికారన్ని విడుదల చేసి గ్రామీణ ప్రాంతాలకు కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత సులభతరం చేసిన రిలయన్స్, ఇప్పుడు రూ.9999కే ల్యాప్‌టాప్ పరికరాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

 

గ్లోబల్ చిప్ తయరీదారు ఇంటెల్, ల్యాప్‌టాప్ పరికరాల తయారీదారు ‘అసస్’లతో ఆర్‌కామ్ ఒప్పందం కుదర్చుకుంది. దిగ్గజ బ్రాండ్ల కలయకతో విడుదల కాబోతున్న ఈ సరికొత్త నెట్‌‌బక్ పరికరం పేరు ‘Asus Eee PCX101’.

 

ఈ నెట్‌బుక్ పరికాలకు రిలయన్స్ ‘బ్రాడ్ బ్యాండ్ వ్యవస్థ’ను సమకూరుస్తుంది. ఆధునిక ఫీచర్లతో ‘అసస్’ ఈ నెట్‌బుక్ పరికరాలను రూపొందించింది. ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌గా వినియోగదారులకు చేరువైన ‘MeeGo’ ఆపరేటింగ్ వ్యవస్థను ‘అసస్’ ఈ గ్యాడ్జెట్‌లో పొందుపరిచింది.

రిలయన్స్, ఇంటెల్, అసస్‌ల తాజా ఒప్పందంతో, గ్రామీణుల కల ఇక నెరవేరునట్లే. త్వరలో చోటుచేసుకుంటున్న ఈ ఆవిష్కరణ సరికొత్త గ్రామీణానికి నాందిపలుకుతుందేమో వేచి చూడాలి మరి!!.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X