రిమ్ 4జీ టాబ్లెట్.. త్వరలో!!

By Prashanth
|
RIM


ప్రపంచపు వేగవంతమైన నెట్‌వర్క్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఎల్‌టీఈ (LTE) ఆధారిత కంప్యూటింగ్ డివైజ్‌లను పలు ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే లాంఛ్ చేశాయి. తాజగా ఈ జాబితాలోకి రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) వచ్చి చేరింది. ఎల్‌టీఈ నెట్‌వర్క్ ఆధారితంగా పనిచేసే ‘న్యూ ప్లేబుక్’ టాబ్లెట్ పీసీని రిమ్ రూపొందించింది. గత ఏడాది చివరిలోనే ఈ డివైజ్ మార్కెట్లోకి రావల్సి ఉంది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తటంతో విడుదల ఈ ఏడాది వరకు ఆలస్యమైంది.

ఆపిల్ ఐప్యాడ్‌కు గట్టి పోటీనిచ్చే విధంగా తాము డిజైన్ చేసిన ప్లేబుక్ ఉంటుందని రిమ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సమంజసమైన ధరకే ఈ ఆడ్వాన్సుడ్ కంప్యూటింగ్ డివైజ్ లభ్యం కానుంది . మే ప్రధమాంకంలో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్ ధర ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X