మార్కెట్లోకి సామ్‌సంగ్ ఖరీదైన ట్యాబ్లెట్!

|

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల ఇండోనేషియాలో ఆవిష్కరించిన అతిపెద్ద ట్యాబ్లెట్ గెలాక్సీ నోట్ ప్రో 12.2 ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. భారత్‌కు చెందిన ప్రముఖ రిటైలర్ Flipkart ఈ ట్యాబ్‌ను రూ.61,890కి ఆఫర్ చేస్తోంది. ఔత్సాహికులు గెలాక్సీ నోట్ ప్రో 12.2 ను బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో సొంతం చేసుకోవచ్చు. మరోవైపు samsungindiaestore ఈ డివైస్‌కు సంబంధించి ప్రీబుకింగ్‌లను ఆహ్వానిస్తోంది. ధర రూ.65,575.

 
మార్కెట్లోకి  సామ్‌సంగ్ ఖరీదైన ట్యాబ్లెట్!

డివైస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

డివైస్ మందం 7.9 మిల్లీమీటర్లు, బరువు 750 గ్రాములు, 12.2 అంగుళాల WQXGA డిస్ ప్లే (రిసల్యూషన్2560× 1600పిక్సల్స్), 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2 ట్యాబ్లెట డివైజ్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 12.2 అంగుళాల WQXGA డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 2560× 1600పిక్సల్స్), డివైస్ మందం 7.9 మిల్లీమీటర్లు, బరువు 750 గ్రాములు.

 

ఎస్-పెన్ స్టైలస్ ఫీచర్‌తో లభ్యం కాబోతున్న ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ వై-ఫై ఇంకా 3జీ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఎక్సినోస్ 5 ఆక్టా (1.9గిగాహెట్స్ x 4 + 1.3GHz x 4) ప్రాసెసర్‌ను డివైస్‌లో వినియోగించారు. 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని మరో 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత. శక్తివంతమైన 9500ఎమ్ఏహెచ్ బ్యాటరీని ట్యాబ్లెట్‌లో నిక్షిప్తం చేసారు.

కనెక్టువిటీ ఫీచర్లు... ఎల్టీఈ/3జీ, వై-ఫై 802.11 a/b/g/n/ac MIMO (2.4 & 5 GHz), వై-ఫై డైరెక్ట్, ఆల్ షేర్ కాస్ట్, బీటీ4.0, యూఎస్బీ 3.0, జీపీఎస్ + గ్లోనాస్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X