రంగుల లోకాన్ని రుచిచూపించే ‘శ్యామ్‌సంగ్ సిరీస్ 3’..!!

By Super
|
Samsung

‘‘దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీదారు ‘శ్యామ్‌సంగ్’ ఇప్పటి వరకు మార్కెట్లో ప్రవేశపెట్టన మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్, నోట్‌బుక్, టాబ్లెట్ పీసీ వంటి గ్యాడ్జెట్లు ప్రపంచ వ్యాప్తంగా అదరహో అనిపించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్రాండ్ తాజాగా విడుదల చేయుబోతున్న 3 సిరీస్ అల్ట్రాలు పోర్టబుల్ ల్యాపీలు అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఆకర్షిస్తాయని సంస్ధ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. బ్లాక్, రెడ్, పర్పిల్, సిల్వర్, వైట్ రంగుల్లో డిజైన్ చేయబడ్డ ఈ ల్యాపీ పరికరాలు వినియోగదారుల మదిని కొల్లగొడతాయట. 3 సిరీస్ లో ప్రధానమైన 350 U మోడల్ ను ముఖ్యంగా ఆడవారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారట. యువత కోరుకునే స్టైల్‌కు తగ్గట్టుగా ల్యాపీలను డిజైన్ చేయ్యటంలో కంపెనీ వర్గాలు కీలకంగా దృష్టిసారించాయని తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టే శ్యామ్‌సంగ్ 3 సిరీస్ అల్ట్రాపోర్టబుల్ ల్యాపీల ధరలు రూ.43,000 ఉండోచ్చని విశ్లేషక వర్గాలు భావిస్తున్నాయి.’’

క్లుప్తంగా శ్యామ్ సంగ్ 3 సిరీస్ ఫీచర్లు:

- పటిష్టమైన i5 ప్రొసెసింగ్ వ్యవస్థ, 640జీబీ హార్డ్ డ్రైవ్ స్టోరేజి వ్యవస్థలు ల్యాపీ పనితీరును మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దుతాయి.

- 12.5 అంగుళాల ధృడమైన డిస్‌ప్లే నాణ్యమైన క్లారిటీని వినియోగదారునికి అందిస్తుంది.

- 1.3కిలో గ్రాముల అతి తక్కువ బరువు కలిగి ఉండే ఈ ల్యాపీ పరికరాలు 8 గంటల బ్యాకప్ సామర్ధ్యంతో కూడిన పటిష్టమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X