సామ్‌సంగ్ అభిమానులకు అదిరిపోయే ‘న్యూస్’

|

Samsung Tab 2 311 Announced in India at Rs 13,900: 7 inch Tablet Market Gets One More Competitor
ఫబ్రవరిలో నిర్వహించే గాడ్జెట్ ఉత్పత్తుల ప్రదర్శన ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ - 2013'కు సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ సమాయుత్తమవుతున్న నేపధ్యంలో ఓ ఆసక్తికర వార్త సామ్‌సంగ్ ట్యాబ్లెట్ అభిమానులను ఊరిస్తుంది. మన్నికతో కూడిన చవక ధర ట్యాబ్లెట్ కంప్యూటింగ్‌ను భారతీయలకు చేరువచేసే క్రమంలో ‘ట్యాబ్ 2 311' పేరుతో రూ.13,900 ధరలో ఓ సరికొత్త ట్యాబ్లెట్‌ను సామ్‌సంగ్ అందుబాటులోకి తీసుకురానుంది. సామ్‌సంగ్ ఇండియా అధికారిక ఈ-స్టోర్‌లో ఇప్పటికే ప్రీ-ఆర్డర్ పై లభ్యమవుతున్న ‘ట్యాబ్ 2 311' ఫిబ్రవరి మొదటి వారంలో మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇండియన్ వర్షన్ ప్రకారం ‘ట్యాబ్ 2 311'గా పేర్కొనబడుతున్న సామ్ సంగ్ ట్యాబ్ 2 7.0 (గ్లోబల్ వర్షన్)ను తొలిగా ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ - 2012'లో ఆవిష్కరించారు. స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల సూపర్ పీఎల్ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
రిస్యూలషన్ 1024 × 600పిక్సల్స్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ కెమెరా (720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం ( ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్‌గ్రేడబుల్),
టజ్‌విజ్ యూఎక్స్ యూజర్ ఇంటర్‌ఫేస్,
వై-ఫై వర్షన్ ట్యాబ్లెట్.

‘సామ్‌సంగ్ ట్యాబ్ 2 311' అసూస్ విడుదల చేసిన గూగుల్ నెక్సస్ 7 ట్యాబ్లెట్‌కు పోటీగా నిలవనుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X