జెమిని...!

వినియోగదారు ఎలక్ట్రానిక్ మార్కెట్లో అభివృద్ధి చెందుతున్న సంస్థ స్కైటెక్స్ (Skytex).తాజాగా ఈ కెంపెనీ రెండు ఆండ్రాయిడ్ ఆధారిత కంప్యూటింగ్ టాబ్లెట్ పీసీలను ప్రకటించింది. వీటి పేర్లు స్కైప్యాడ్ ప్రోటోస్, స్కైప్యాడ్ జెమిని. ఈ రెండింటిలో ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ఐస్క్రీమ్ శాండ్విచ్ను నిక్షిప్తం చేశారు. ఈ పీసీలు ద్వారా క్లౌడ్ సర్వీస్లను (5జీబి స్టోరేజ్ వరకు)యాక్సిస్ చేసుకోవచ్చు.
స్కైప్యాడ్ ప్రోటోస్ ఫీచర్లు:
9.7 అంగుళాల టచ్స్ర్కీన్,
ఆండ్రాయిడ్ ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
శక్తివంతమైన 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (20గంటలు వెబ్ యూసేజ్),
1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
హెచ్డిఎమ్ఐ పోర్ట్, మినీ యూఎస్బీ పోర్ట్,
32జీబి ఎక్స్ప్యాండబుల్ మెమరీ.
ధర రూ.15,000.
స్కైప్యాడ్ జెమిని ఫీచర్లు:
ఆండ్రాయిడ్ ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల టచ్స్ర్కీన్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆప్టిమైజుడ్ వై-ఫై,
హెచ్డిఎమ్ఐ అవుట్పుట్.
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications








