నవీకరణ దిశగా సోనీ పావులు..?

డిజిటల్ ప్రపంచంలో ప్రధాన భూమిక పోషిస్తున్న ‘సోనీ’ నవీకరణ దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుత కంప్యూటింగ్ ప్రపంచానికి ట్రెండ్ సెట్టర్గా నిలిచిన టాబ్లెట్ కంప్యూటర్లు మరింత ఆధునికతను సంతరించుకుంటున్న నేపధ్యంలో సోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నవీకరణలో భాగంగా సోనీ ఇటీవల విడుదల చేసిన ఎస్, పీ టాబ్లెట్ పీసీలలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ 4.0 ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టంను లోడ్ చేసేందుకు పరిశోధనలు చేపట్టారు. ఎప్రిల్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని విశ్వశనీయవర్గాల సమచారం. ప్రస్తుతం ఈ డివైజ్లు ఆండ్రాయిడ్ హనీకూంబ్ ఆపరేటింగ్ వ్యవస్థ పై రన్ అవుతున్నాయి.
సోనీ టాబ్లెట్ S ముఖ్య ఫీచర్లు:
* 9.4 అంగుళాల వెడల్పు స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 1280 పిక్సల్స్) ,
* 5మెగా పిక్సల్ కెమెరా,
* టచ్ ఫోకస్,
* జియో ట్యాగింగ్,
* హై పవర్ బ్యాటరీ,
సోనీ టాబ్లట్ P ఫీచర్లు:
* డ్యూయల్ టీఎఫ్టీ టచ్ స్ర్కీన్ (సుసంపన్నమైన 16,000 కలర్స్ తో),
* 5 మెగా పిక్సల్ కెమెరా,
* ఎక్సటర్నల్ మెమరీ 32జీబి,
* బ్యాటరీ బ్యాకప్ 17 గంటలు.


Click it and Unblock the Notifications








