తోషిబా సరికొత్త టాబ్లెట్ పీసీ త్వరలో...!!!

ఆధునిక సాంకేతిక వ్యవస్థతో రూపొందించిన ‘అల్ట్రాతిన్ AT700’ టాబ్లెట్ పీసీని తోషిబా, జపాన్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. కొత్త జనరేషన్ వ్యవస్థలతో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్లను 2012 ప్రారంభానికి, ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనలో తోషిబా ఉంది.
యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో తయారైన ‘తోషిబా అల్ట్రాతిన్ AT700’ టాబ్లెట్ పీసీ బరువు కేవలం 558 గ్రాముల మాత్రమే. 0.3 అంగుళాల మందపు ధారుడ్యంతో డిజైన్ చేయబడిన ఈ గ్యాడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకుంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. 10.1 అంగుళాల స్క్రీన్ 1280*800 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 3.2 ఆపరేటింగ్ వ్యవస్థను ఈ టాబ్లెట్లో లోడ్ చేశారు. 1.2GHz డ్యూయల్ కోర్ ప్రొసెసింగ్ వ్యవస్థ వేగవంతమైన పనితీరును వినియోగదారుడికి అందిస్తుంది. 32జీబీ ఇంటర్నల్ మెమరీ వ్యవస్థ స్టోరేజి అంశాల్లో మరింత లబ్ధి చేకూరుస్తుంది.
5 మెగా పిక్సల్ రేర్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలను టాబ్లెట్ పీసీలో అమర్చారు. కనెక్టువిటీ అంశాలైన బ్లూటూత్, వై-ఫైలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి. జీపీఎస్ కనెక్టువిటీతో పాటు ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ ఆప్లికేషన్లను గ్యాడ్జెట్లో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ 9 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
ధర ఇతర ఫీచర్లకు సంబంధించి వివరాలను తోషిబా త్వరలో ప్రకటించనుంది.


Click it and Unblock the Notifications








