బ్లూటూత్ కన్నా ఫాస్టెస్ట్ టెక్నాలజీ!!

కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ సెగ్మెంట్లో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ‘తోషిబా’ భవిష్యత్ తరం టెక్నాలజీ పై దృష్టిసారించి సఫలీకృతమైంది. వై-ఫై, బ్లూటూత్ వ్యవస్థలకన్నా వేగవంతంగా స్పందించే ‘ట్రాన్స్ఫర్ జెట్ టెక్నాలజీ’ని ఈ బ్రాండ్ వృద్థి చేసింది. తోషిబా టాబ్లెట్ పీసీలలో ఈ సాంకేతికతను దోహదం చేయునున్నారు. ఈ టెక్నాలజీ వై-ఫై, బ్లూటూత్ స్థానాలను భర్తీ చేస్తుంది. ఈ తాజా డవలెప్మెంట్ తోషిబాకు కలిసొచ్చే అంశంగా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
ట్రాన్స్ఫర్ జెట్ టెక్నాలజీని తోషిబా టాబ్లెట్లలో ప్రవేశపెట్టడం వల్ల డేటా ట్రాన్సఫర్ గరిష్ట వేగం 560Mbpsగా ఉంటుంది. బ్లూటూత్తో పోలిస్తే తక్కువ పవర్ను ఈ డివైజ్ ఖర్చు చేస్తుంది. సులువైన యూజర్ ఫ్రెండ్లీ విధానాల ద్వారా ఈ సాంకేతికతను వినియోగించుకోవచ్చు. బిజినెస్ మరియు ప్రొఫెషనల్ వినియోగదారులకు ఈ వేగవంతమైన డేటాషేరింగ్ టెక్నాలజీ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








