వచ్చే ఏడాది మార్కెట్ను శాసించేందుకు...!!!

అంతర్జాతీయంగా టాబ్లెట్ కంప్యూటర్ల మార్కెట్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపధ్యంలో వాటి తయారీ సంస్థలు మెరుగైన ఉత్పత్తి దశగా అడుగులు వేస్తున్నాయి. కంప్యూటింగ్ పరికరాలు తయారీలో ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన ‘తోషిబా’ అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ చేసిన టాబ్లెట్ పీసీని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
ప్రపంచపు అత్యున్నత పల్చటి టాబ్లెట్ పీసీగా వినియోగదారులకు 100% లబ్ధి చేకూర్చనున్న ‘తోషిబా ఎక్సైట్’ (Toshiba Excite) ఫీచర్లు క్లుప్తంగా:
- అల్ట్ర్రా కాంపాక్ట్,
- బరువు 558 గ్రాములు,
- 10.1 అంగుళాల స్క్ర్రీన్,
- మల్టీ టచ్ సపోర్ట్,
- రిసల్యూషన్ 1280 x 800 పిక్సల్స్,
- రెండు కెమెరాలు, రేర్ 5 మెగా పిక్సల్, ఫ్రంట్ 2 మెగా పిక్సల్
- హెచ్ఢీఎమ్ఐ పోర్ట్ సౌలభ్యత,
- పటిష్ట ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
- శక్తివంతమైన TI OMAP 4430 ప్రాసెసర్,
- మెమరీ 1024 MB,
- 16, 32 జీబీ వేరింయట్లలో లభ్యమవుతున్న ఈ టాబ్లెట్ పీసీలను వినియోగదారుడు అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు,
- వై-ఫై సౌలభ్యత,.
- ఇంటిగ్రేటెడ్ బ్లూటూత్ వ్యవస్థ,
- విడుదల 2012 ప్రధమాంకం.


Click it and Unblock the Notifications








