దేశం పై కన్నేసిన ముంబయ్ డాన్..?

ముంబయ్కు చెందిన ఆ కంపెనీ భారత్ భవిష్యత్ను మార్చనుందా..?, ఈ పరిణామాలతో సామాన్యుడు సైతం టాబ్లెట్ కంప్యూటర్ను వసం చేసుకోనున్నాడా..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెబుతోంది ముంబయ్కు చెందిన విష్టెల్ (Wishtel)సంస్థ, టాబ్లెట్ పీసీల ఉత్పాదక రంగం వైపు మొగ్డు చూపిన ఈ దేశీ బ్రాండ్ మాడు సరికొత్త టాబ్లెట్ పీసీలను భారతీయులకు పరిచయం చేయునుంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ టాబ్లెట్ కంప్యూటర్లు IRA Thing R, IRA E, IRA Icon Eగా డిజైన్ కాబడ్డాయి. వీటి డిస్ప్లే పరిమాణం 7 అంగుళాలు. ఆండ్రాయిడ్ ఫ్రోయో 2.2, ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ 2.3, ఆండ్రాయిడ్ లైనెక్స్ వోఎస్లను ఈ పీసీలలో లోడ్ చేశారు. ధరలు రూ.4,000 నుంచి రూ.5,000 మధ్య ఉంటాయి. వేగవంతమైన ఇంటర్నెట్ను ఈ డివైజ్లు అందుకుంటాయి.
ఇతర ఫీచర్లు:
* 3జీ కనెక్టువిటీ,
* వై-ఫై,
* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
* హై డెఫినిషన్ కెమెరా.


Click it and Unblock the Notifications








