ఊహించని ధరలో 100 ఇంచ్ స్మార్ట్ టీవీ వచ్చేస్తోంది
ఇండియా ఇప్పుడు స్మార్ట్ టీవీలకు వేదికగా మారింది. ప్రపంచంలో ఉన్న దిగ్గజాల చూపు మొత్తం ఇండియా మీద పడిందనే చెప్పవచ్చు.
ఇండియా ఇప్పుడు స్మార్ట్ టీవీలకు వేదికగా మారింది. ప్రపంచంలో ఉన్న దిగ్గజాల చూపు మొత్తం ఇండియా మీద పడిందనే చెప్పవచ్చు.నాన్ స్మార్ట్ టీవీలను కాదని దిగ్గజాలు బడ్జెట్ ధరల్లో పోటీ పడుతూ తమ టీవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా డీటెల్ కంపెనీ కూడా తమ స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ మధ్య రూ.3999కే 19 ఇంచ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసి సంచలనం రేపిన సంగతి అందరికీ విదితమే. అయితే ఈ సంచలనం మరువక ముందు అత్యంత తక్కువ ధరకే 100 ఇంచ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసేందుకు రెడీ అయింది. గిజ్బాట్కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటరాక్షన్ లో Detel MD Yogesh Bhatia మాట్లాడుతూ రానున్న నెలల్లో 100 ఇంచ్ స్మార్ట్ టీవీని ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు.

కొత్త ప్లాంట్ ఏర్పాటు
కంపెనీ నార్త్ ఇండియాలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటుందని ఆయన తెలిపారు. అయితే పెట్టుబడి ఎంత పెడుతున్నారనే విషయం గురించి దాటవేశారు. మొత్తం మూడు కొత్త స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని తెలిపారు.

అత్యాధునిక ఫీచర్లతో ఎల్ఈడి టీవీలను
ఇప్పుడు ఉన్న దిగ్గజాలు షియోమి, శాంసంగ్ లకు పోటీగా అత్యాధునిక ఫీచర్లతో ఎల్ఈడి టీవీలను ఈ కంపెనీ ప్రవేశపెట్టబోతోంది. ఈ టీవీలను కంపెనీ వెబ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి 1 నెల వారంటీ కూడా ఇస్తోంది. వారంటీని పొడిగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది.

ఈ వారంటీ 24" to 55" LED TVలకు వర్తిస్తుంది
ఈ వారంటీ 24" to 55" LED TVలకు వర్తిస్తుంది. రూ.1199తో వారంటి ప్రారంభమవుతుంది. ఇది లిమిటిడ్ పిరియడ్ మాత్రమే. అయితే 32 ఇంచ్ టీవీలకు రూ.1799కే 4 సంవత్సరాల వారంటీని అందిస్తోంది.

డీటెల్ కంపెనీ టీవీలను కొనుగోలు చేసిన వారికి
ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే డీటెల్ కంపెనీ టీవీలను కొనుగోలు చేసిన వారికి మార్చి 31 వరకు వారంటీని పెంచుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. 24 గంటలూ కంపెనీ సైట్లు కొనుగోలు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది.


Click it and Unblock the Notifications








