మరోసారి భారీ ఆఫర్లతో దూసుకొచ్చిన ఫ్లిప్కార్ట్, ఈ సారి టీవీలపై..
దేశీయ రంగంలో దూసుకుపోతున్న ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసారి పండుగ ఆఫర్లకు తెరతీసింది
దేశీయ రంగంలో దూసుకుపోతున్న ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసారి పండుగ ఆఫర్లకు తెరతీసింది. ఈ సారి మొబైల్ ఫోన్లు కాకుండా ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్టీవీలు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. వీటితో పాటు ఎక్సేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచింది. రాయితీ ధరల్లో హెచ్డీ ఎల్ఈడీ టీవీలు కొనుక్కోవాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా మైక్రోమ్యాక్స్, శాంసంగ్, వియూ, పానసోనిక్ , ఎల్జీలకుచెందిన హై ఎండ్ బ్రాండ్ టీవీలపై డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తోంది. మార్చి 16-18 దాకా 70శాతం డిస్కౌంట్స్. ఐసీఐసీఐ కార్డు ద్వారా కొనుగోళ్లపై 10శాతం డిస్కౌంట్ అదనంగా లభిస్తాయి. తగ్గింపు పొందిన టీవీ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

32 అంగుళాల మైక్రోమ్యాక్స్ Tv..
32 అంగుళాల మైక్రోమ్యాక్స్ హెచ్డీ ఎల్ఈడీ దాదాపు 3వేలనుంచి డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ టీవీని ప్రస్తుత ఆఫర్లో12,499 రూపాయల వరకు పొందవచ్చు, ఈ టీవీ అసలు ధర రూ. 19,990.

కోడాక్ హెచ్డీ స్మార్ట్ర్ట్
కోడాక్ హెచ్డీ స్మార్ట్ర్ట్ టీవీ ధర రూ .14,999. దీని అసలు ధర రూ .20,990. 32 ఇంచుల వియూ full-HD LED TVని యూజర్లు రూ. 13,499కే సొంతం చేసుకోవచ్చు. కాగా దీనిఅసలు ధర రూ. 16వేలగా ఉంది.

శాంసంగ్ 40 అంగుళాల టీవీలపై..
దీంతోపాటు శాంసంగ్ 40 అంగుళాల టీవీలపై 24శాతం డిస్కౌంట్. రూ. 47,999 విలువ చేసే శాంసంగ్ ఎల్ఈడీ టీవీ రూ.35,999లకే లభ్యం. అలాగే రూ.28,900 విలువ చేసే శాంసంగ్ హెచ్డి టీవీని యూజర్లు 17,999కే సొంతం చేసుకోవచ్చు.

ఎల్జీ 32ఇంచెస్ టీవీ.
ఇక ఎల్జీ 32ఇంచెస్ టీవీ రూ.18,4999 లకు అందిస్తోంది. దీని అసలు ధర రూ.23,990గా ఉంది. అలాగే టీవీల కొనుగోళ్ల సందర్భంగా రూ. 8వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్ కూడా కస్టమర్లకు అందిస్తోంది. వీటితోపాటు ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లుకూడా అందుబాటులో ఉన్నాయి.

సూపర్ వాల్యూ వీక్
ఇదిలా ఉంచితే మార్చి 18 నుంచి 24 మధ్య స్మార్ట్ఫోన్లపై మరిన్ని ఆఫర్లతో మొబైల్ ప్రేమికులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఫ్లిప్కార్ట్లో సూపర్వ్యాలూ వీక్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. మీ డ్రీమ్ ఫోన్ను సొంతం చేసుకోమంటూ ఊరిస్తోంది.


Click it and Unblock the Notifications








