400 రైల్వే స్టేషన్స్ లో ప్రారంభం కాబోతున్న ఫ్రీ వైఫై సర్వీస్ ....
భారతీయ రైల్వే స్టేషన్లలో ఉచితంగా Wi-Fi అందిచడం లో Google విజయవంతం అయింది . డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా గూగుల్ రైల్ టెల్ తో జతై 400 రైల్వే స్టేషన్లకు ఉచితంగా Wi-Fi సేవలను అందించడం ప్రారంభించింది.గుజరాత్ మరియు అస్సాంలోని రైల్వే స్టేషన్లో గూగుల్ తన పనిని పూర్తి చేసింది.ఈ ప్రాజెక్ట్ వల్ల దేశం డిజిటల్ దేశం గా మారబోతోంది.
భారతదేశంలో ప్రతిఒక్కరికీ ఫ్రీ wifi సేవలను అందిచడం ఒక మంచి ఆలోచన. రైల్వే స్టేషన్ల ద్వారా లక్షలాది మంది భారతీయులకు ఫ్రీ wifi సేవలను అందిచడం అద్భుతం .నెలకు 8 మిలియన్ల ప్రజలు ఈ సేవని అందుకోవచ్చు . ఇది దేశం లో అతిపెద్ద ప్రాజెక్టు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చేయడం ముఖ్యం అని గూగుల్ ఇండియా భాగస్వామి పార్ట్ కె.సురి తెలిపారు .

రైల్ వైర్ యొక్క ప్రత్యేకతలు:
35% యూజర్స్ మొదటి సారి గా ఫ్రీ wifi వాడుతున్నారు
50% యూజర్స్ అనేక సార్లు ఫ్రీ Wifi వాడారు .
మొదట 100 మంది రద్దీ గ ఉన్న 100 స్టేషన్స్ లో ఫ్రీ వైఫై మొదలబెట్టడం జరిగింది
గత ఒకటిన్నర సంవత్సరాల్లో 300 కొత్త రైల్వే స్టేషన్లకు ఫ్రీ Wi-Fi.
ఈ ప్రాజెక్ట్ విజయవంతం ఆయినందు వలన మరి కొన్ని రైల్వే స్టేషన్స్ లో ఫ్రీ Wifi అందించబోతుంది


Click it and Unblock the Notifications