రూ. 2000 విలువ గల జియోఫై రూ. 999కే, ఏడాది పాటు డేటా ఫ్రీ
జియో దసరా ఫెస్టివల్ సందర్భంగా తమ యూజర్ల కోసం బంపరాఫర్ ని ప్రకటించింది.
జియో దసరా ఫెస్టివల్ సందర్భంగా తమ యూజర్ల కోసం బంపరాఫర్ ని ప్రకటించింది. జియో 4జీ హాట్స్పాట్ హబ్ అయిన జియో వైఫై డోంగిల్పై భారీ డిస్కౌంట్ ను అందజేస్తోంది. రూ. 1999 విలువ గల ఈ డోంగిల్ ను ఇప్పుడు కేవలం రూ. 999కే అందిస్తోంది. జియో యూజర్ల కోసం ఈ డివైస్ ను ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంచారు. కొత్త ధరను జియో. కామ్లోనూ అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్లోనూ ఇప్పటికే ప్రవేశపెట్టారు.

సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు
జియో కంపెనీ నుంచి ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

32 డివైస్ లకు ఒకేసారి కనెక్ట్
ఈ డోంగిల్ ద్వారా 32 డివైస్ లకు ఒకేసారి కనెక్ట్ కావచ్చు. ఇది 2300mAh బ్యాటరీతో వచ్చింది. ఒకసారి ఛార్జింగ్ పెడితే అది 5 నుంచి 6 గంటల పాటు వర్క్ అవుతుంది.

మీ ఆధార్ కార్డుని
జియో సిమ్ ద్వారా ఈ డివైస్ ను వాడుకోవచ్చు. కొనుగోలు సమయంలో మీకు జియో సిమ్ తో పాటు బెస్ట్ ప్లాన్ ఆఫర్ ని కూడా ఇస్తారు. అయితే దీనికి మీరు మీ ఆధార్ కార్డుని సమర్పించాల్సి ఉంటుంది.

సంవత్సరం పాటు ప్రీ డేటా
ఇప్పుడు ఈ డివైస్ కొన్నవారికి సంవత్సరం పాటు ప్రీ డేటా ఉచిత వాయిస్ కాల్స్ ని జియో అందిస్తోంది.

స్పీడ్
వైఫై ద్వారా కనెక్ట్ అయ్యే ఈ డివైస్ నుంచి యూజర్లు 150Mbps డేటా స్పీడ్ అలాగే 50 Mbps అప్ లోడ్ స్పీడ్ పొందవచ్చని జియో తెలిపింది.


Click it and Unblock the Notifications








