GST ఎఫెక్ట్, తగ్గిన షియోమి యాక్ససరీల ధరలు
ఈ మధ్య పలు రకాల ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గడంతో షియోమీ సంస్థ తాను యూజర్లకు అందిస్తున్న పలు యాక్ససరీల ధరలను ఇవాళ తగ్గించింది.
జీఎస్టీ ప్రభావం అన్ని రంగాల మీద పడుతోంది. ఈ మధ్య పలు రకాల ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గడంతో షియోమీ సంస్థ తాను యూజర్లకు అందిస్తున్న పలు యాక్ససరీల ధరలను ఇవాళ తగ్గించింది. పలు ఉత్పత్తులపై తగ్గిన జీఎస్టీ కారణంగా తన యాక్ససరీల ధరలను తగ్గిస్తున్నట్టు షియోమీ ప్రకటించింది. తగ్గిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్
షియోమీ 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ రూ.1599 ఉండగా రూ.100 తగ్గి రూ.1499కే లభిస్తున్నది. అలాగే 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ రూ.2199 ఉండగా రూ.1,999 ధరకు లభిస్తోంది.

ఎంఐ బిజినెస్ బ్యాక్ప్యాక్
ఎంఐ బిజినెస్ బ్యాక్ప్యాక్ రూ.1499 ఉండగా రూ.1299కు, ఎంఐ బ్యాండ్ 2ఐ స్ట్రాప్ రూ.229 ఉండగా రూ.199కు, ఎంఐ చార్జర్ రూ.399 ఉండగా, రూ.349 ధరకు లభిస్తున్నాయి.

యూఎస్బీ ఫ్యాన్
ఎంఐ కార్ చార్జర్ రూ.799 ఉండగా, రూ.699కు, యూఎస్బీ కేబుల్ రూ.199 ఉండగా, రూ.179 ధరకు, 2 ఇన్ 1 యూఎస్బీ కేబుల్ రూ.299 ఉండగా, రూ.249 ధరకు, యూఎస్బీ ఫ్యాన్ రూ.249 ఉండగా రూ.229 ధరకు లభిస్తున్నాయి.

ఇతర యాక్ససరీల ధరలను..
ఇవే కాకుండా ఇంకా ఇతర యాక్ససరీల ధరలను కూడా షియోమీ తగ్గించింది. ఈ తగ్గిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications








