ఈ రాత్రికి కరెంట్ కట్ చేస్తాం అని మెసేజ్ వచ్చిందా? మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
"ఈ రాత్రికి కరెంట్ కట్ చేస్తాం" అంటూ వచ్చే నకిలీ హెచ్చరికలు దేశవ్యాప్తంగా మళ్లీ ముమ్మరమయ్యాయి. ఈరోజు, సెప్టెంబర్ 19న వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఇలాంటి నకిలీ మెసేజ్లు విపరీతంగా వస్తున్నాయి. వెంటనే బిల్లు కట్టకపోతే అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామంటూ వినియోగదారులను భయపెట్టి, అనుమానాస్పద లింక్లు, నంబర్లను పంపుతున్నారు. ఇలాంటి సందేశాలు చూసి కంగారు పడకుండా, ఒకసారి నిజానిజాలు సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పటికే డబ్బులు పోగొట్టుకుంటే.. వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయండి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి.
సైబర్ నేరగాళ్లు దీనికోసం ఒక పక్కా ప్లాన్ ఉపయోగిస్తున్నారు. మీ విద్యుత్ డిస్కమ్ సంస్థ లేదా భారత్ బిల్ పే (Bharat BillPay) ప్రతినిధులుగా నటిస్తూ ఒక ఏపీకే (APK) ఫైల్ లేదా రిమోట్ యాక్సెస్ లింక్ను పంపుతారు. ఆ లింక్ ద్వారా మీరు ఫోన్లో 'యాక్సెసిబిలిటీ' లేదా 'డివైస్ అడ్మిన్' పర్మిషన్లు ఇచ్చారంటే ఇక అంతే సంగతులు! మీ ఫోన్ స్క్రీన్ను వాళ్లు చూస్తూ, మీకు వచ్చే ఓటీపీలను నొక్కేసి, యూపీఐ (UPI) ఖాతాలోని డబ్బు మొత్తాన్ని ఖాళీ చేస్తారు. 'కేవైసీ' పేరుతో వచ్చే ఇలాంటి విద్యుత్ మెసేజ్లపై టెలికాం శాఖ (DoT) ముందే హెచ్చరించింది. పోలీసులు కూడా ఇలాంటి ఫ్రాడ్స్పై నిఘా పెట్టారు.

వాట్సాప్ మెసేజ్ నిజమో కాదో ఇలా సరిచూసుకోండి
తొందరపడి వెంటనే బిల్లు చెల్లించకండి. ముందుగా మీ విద్యుత్ సంస్థ (DISCOM) అధికారిక యాప్ లేదా వెబ్సైట్లోకి వెళ్లి మీ పాత బిల్లు, చెల్లింపు గడువు తేదీని సరిచూసుకోండి. బ్యాంక్ లేదా యూపీఐ యాప్ల ద్వారా చెల్లించాలనుకుంటే.. భారత్ బిల్ పేలో నేరుగా మీ బిల్ ప్రొవైడర్ను సెర్చ్ చేయండి. అంతేకానీ మెసేజ్లలో వచ్చే లింక్లపై మాత్రం క్లిక్ చేయకండి. మెసేజ్లో ఉన్న మొబైల్ నంబర్లకు కాకుండా, విద్యుత్ శాఖ అధికారిక హెల్ప్లైన్ నంబర్కే కాల్ చేయండి. ఏదైనా మోసం జరిగితే అత్యవసరంగా ఫిర్యాదు చేయడానికి 1930 నంబర్ను సేవ్ చేసుకోండి.
సంచార్ సాథీ 'చక్షు' పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయండిలా..
మొదట 'సంచార్ సాథీ' (Sanchar Saathi) వెబ్సైట్ ఓపెన్ చేసి, 'రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ (Chakshu)' ఆప్షన్ను ఎంచుకోండి. ఆ తర్వాత వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసి, కేటగిరీ, మెసేజ్ పంపినవారి వివరాలు, సమయం, స్క్రీన్షాట్ను జత చేయండి. చివరగా ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సైబర్ మోసాలకు చెక్ పెట్టడానికి, డిజిటల్ ప్లాట్ఫారమ్లను అప్రమత్తం చేయడానికి ఈ 'చక్షు' సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందని టెలికాం శాఖ తెలిపింది.
పొరపాటున ఏపీకే (APK) లింక్ క్లిక్ చేస్తే.. ఫోన్లో ఈ పనులు చేయండి
ఒకవేళ మీరు ఆ లింక్ క్లిక్ చేసి, ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే.. వెంటనే ఫోన్ను 'ఏర్ప్లేన్ మోడ్'లో పెట్టండి. ఫోన్లో ఉన్న తెలియని యాప్లను అన్ఇన్స్టాల్ చేయండి. 'యాక్సెసిబిలిటీ' (Accessibility), 'డివైస్ అడ్మిన్' (Device Admin) పర్మిషన్లను క్యాన్సిల్ చేసి, ఆపై యాప్లను తొలగించండి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ (Google Play Protect) రన్ చేసి, ఆండ్రాయిడ్ వెర్షన్ను అప్డేట్ చేయండి. మీ యూపీఐ పిన్ (UPI PIN), బ్యాంకింగ్ పాస్వర్డ్లను వెంటనే మార్చేయండి. మీ బ్యాంక్కు ఫోన్ చేసి ఖాతాను పర్యవేక్షించమని లేదా తాత్కాలికంగా బ్లాక్ చేయమని కోరండి. చివరగా, జరిగిన మోసానికి సంబంధించిన ఆధారాలను సేవ్ చేసుకుని 1930 హెల్ప్లైన్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో వెంటనే ఫిర్యాదు చేయండి.
సేఫ్ బిల్ పేమెంట్స్.. వాట్సాప్ సెక్యూరిటీ టిప్స్
మీ విద్యుత్ సంస్థ (DISCOM) అధికారిక యాప్, వెబ్సైట్ లేదా బ్యాంకింగ్, యూపీఐ యాప్లలోని 'భారత్ బిల్ పే' ద్వారా మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించండి. దీనివల్ల నకిలీ లింక్ల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. అలాగే, మీ వాట్సాప్ ఖాతా ఇతరుల చేతుల్లోకి పోకుండా ఉండేందుకు 'టూ-స్టెప్ వెరిఫికేషన్' (Two-step verification) ఎనేబుల్ చేసుకోండి. ఏదైనా సందేహాస్పదంగా అనిపిస్తే.. తొందరపడకుండా ముందుగా ఆ మెసేజ్ నిజమో కాదో సరిచూసుకోవడం చాలా ముఖ్యం.


Click it and Unblock the Notifications
