కేవలం రెండు మొబైల్ ఎస్ఎంఎస్లతో రైల్వే టికెట్ను బుక్ చేసుకోవటం ఏలా..?
రైల్వే టికెట్ను బక్ చేసుకునేందకు రిజర్వేషన్ కౌంటర్కు వెళ్లవల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ ద్వారానే రైలు టికెట్ను బుక్ చేసుకోవచ్చు. అందుకు మీరు చేయవల్సిందల్లా మీ ఫోన్ నుంచి 139 లేదా 5676714 నంబర్లకు రెండు సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్లు) పంపడమే. రైలు ప్రయాణానికి సంబంధించిన రైల్వే టికెట్లు ఇప్పటివరకు రిజర్వేషన్ కౌంటర్ల ద్వారానూ... ఆన్లైన్ ఇంటర్నెట్ బుకింగ్ల ద్వారానూ కొనుగోలు చేసేందుకు మాత్రమే అవకాశాలు ఉండేవి. నేరుగా మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా టికెట్ కొనుగోలు చేసుకొనే సదుపాయాన్ని రైల్వే శాఖా మంత్రి మల్లికార్జున ఖర్గే ఇటీవల ఢిల్లీలో ప్రారంభించారు. అంతర్జాలం ఇంకా స్మార్ట్ఫోన్ సదుపాయం లేని సాధారణ సెల్ఫోన్ యూజర్లు సైతం ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకునే విధానాన్ని క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

కేవలం రెండు మొబైల్ ఎస్ఎంఎస్లతో రైల్వే టికెట్ను బుక్ చేసుకోవటం ఏలా
ముందుగా మీ మొబైల్ నెంబరును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలి.

కేవలం రెండు మొబైల్ ఎస్ఎంఎస్లతో రైల్వే టికెట్ ను బుక్ చేసుకోవటం ఏలా..?
ఈ చర్య పూర్తి అయిన వెంటనే సదరు బ్యాంకు మీకు మొబైల్ మనీ ఐడెంటిఫయర్ ఇంకా వన్ టైమ్ పాస్వర్డ్ నెంబర్లను ఇస్తుంది.

కేవలం రెండు మొబైల్ ఎస్ఎంఎస్లతో రైల్వే టికెట్ ను బుక్ చేసుకోవటం ఏలా..?
తరువాత మీ మొబైల్ నెంబరును ఐఆర్సీటీసీలో రిజిస్టర్ చేయాలి. ఈ చర్యలను సమర్థవంతంగా పూర్తి చేసినట్లయితే మీ మొబైల్ ఫోన్ రైలు టికెట్ను బుక్ చేసుకునేందుకు అర్హత సాధించనట్లే.

కేవలం రెండు మొబైల్ ఎస్ఎంఎస్లతో రైల్వే టికెట్ ను బుక్ చేసుకోవటం ఏలా..?
టికెట్ బుక్ చేసుకునే విధానం:
మీరు ప్రయాణించబోయే రైలు నంబరు, వెళ్లవలిసిన ప్రదేశం, ప్రయాణ తేది, ప్రయాణించనున్న శ్రేణి, పేరు, వయసు, లింగ వంటి వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్ నుంచి 139 లేదా 5676714 నంబర్లకు పంపాలి.

కేవలం రెండు మొబైల్ ఎస్ఎంఎస్లతో రైల్వే టికెట్ ను బుక్ చేసుకోవటం ఏలా..?
వెంటనే ట్రాన్సెక్షన్ ఐడీ వివరాలతో ఒక సందేశం మీ మొబైల్కు వస్తుంది.

కేవలం రెండు మొబైల్ ఎస్ఎంఎస్లతో రైల్వే టికెట్ ను బుక్ చేసుకోవటం ఏలా..?
తరువాత పే అని టైప్ చేసి ట్రాన్సెక్షన్ ఐడీ ఎంఎంఐడీ, ఓటీపీ వివరాలను ఎస్ఎంఎస్గా పంపితే టికెబ్ బుక్ అవుతుంది.

కేవలం రెండు మొబైల్ ఎస్ఎంఎస్లతో రైల్వే టికెట్ ను బుక్ చేసుకోవటం ఏలా..?
ఒక్కో ఎస్ఎంఎస్ కు రూ.3 ఛార్జ్ చేస్తారు, చెల్లింపులకు సంబంధించి రూ.5,000లోపు టికెట్లకు రూ.5, రూ. అయిదువేలకు పైబడిన టికెట్లకు రూ.10 చొప్పున వసూలు


Click it and Unblock the Notifications








