Just In
- 26 min ago 50MP కెమెరా, 45W ఛార్జింగ్ సపోర్టుతో రియల్మి స్మార్ట్ఫోన్లు విడుదల.. ఇవాళ కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు!
- 1 hr ago Vivo నుంచి కొత్త ఫోన్, మరో రెండు రోజుల్లో లాంచ్! లీక్ అయిన వివరాలు
- 1 hr ago 12 గంటల ప్లేబ్యాక్ టైం, వాటర్ ప్రూఫ్ డిజైన్తో షియోమీ సౌండ్ స్పీకర్లు.. పూర్తి వివరాలు.!
- 3 hrs ago 200MP కెమెరా, 6.7 అంగుళాల స్మార్ట్ఫోన్పై డిస్కౌంట్.. రూ.3000 తగ్గింపు సహా అమెజాన్ సేల్ పూర్తి వివరాలు!
Don't Miss
- News జగన్ ఎఫెక్ట్ - ప్రధాని, బీజేపీ స్పందనకు భిన్నంగా పవన్..!!
- Finance Aditya Birla News: అంబానీ-టాటాలను టార్గెట్ చేసిన బిర్లా గ్రూప్.. హై'టెక్' ప్లాన్..!!
- Sports Hardik x Rohit: పాపం హార్దిక్.. ఏడ్వలేక నవ్వుతున్నాడు!
- Travel విశాఖవాసులకు గుడ్న్యూస్... సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ రూట్స్ ఇవే..!
- Lifestyle పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ కేసులు.. అందుబాటులో వ్యాక్సిన్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- Movies Aavesham Box Office 50 కోట్లకు చేరువగా ఆవేశం.. ఫాహద్ ఫాజిల్ మూవీకి కలెక్షన్ల వర్షం!
- Automobiles కొత్త Maruti Swift లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది!.. ఇక్కడ చూడండి
చిన్నపిల్లల కోసం కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంబమైంది!! CoWIN యాప్లో నమోదు చేసుకోవడం ఎలా??
భారతదేశంలో చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్లను అందించడం కోసం భారత ప్రభుత్వం తన యొక్క సన్నాహాలను మరింత ముమ్మరం చేసింది. దేశంలోని 15 నుంచి 18 ఏళ్ల గ్రూప్లోని పిల్లలకు అందరికి టీకాలు వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. ఈ టీకాలు జనవరి 3, 2022న ప్రారంభం కానుంది. అయితే రిజిస్ట్రేషన్ జనవరి 1, 2022న నుంచి మొదలయ్యాయి.
కరోనా యొక్క కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఆఫ్ కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి నుండి 15-18 ఏళ్ల మధ్య వయస్సు వారికి టీకాలు వేయడంతో సహా కరోనాపై పోరాటంలో మూడు ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు. ఇది కాకుండా మరొక పెద్ద ప్రకటన చేస్తూ జనవరి 10 నుండి వృద్ధులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు 60 ఏళ్లు పైబడిన ఫ్రంట్లైన్ కార్మికులకు బూస్టర్ డోస్ ప్రారంభించబడుతుందని కూడా ప్రధాని ప్రకటించారు.
కోవిడ్ పోర్టల్లో 15-18 ఏళ్ల మధ్య వయససు గల పిల్లల టీకా కోసం జనవరి 1 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ప్రారంభమైంది. అదే సమయంలో జనవరి 3 నుండి ప్రారంభమయ్యే టీకా సమయంలో వాక్-ఇన్ ద్వారా కూడా టీకాలు వేయవచ్చు. సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ పాఠశాల స్థాయిలలో ప్రాధాన్యతా ప్రాతిపదికన టీకా సెషన్లు నిర్వహించబడతాయి. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న బాలబాలికలకు 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల కో-వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వబడుతుంది.
దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా వేగాన్ని మనం పరిశీలిస్తే ఈ వయస్సు వారికి టీకాలు వేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 16,764 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు 27.4 శాతం పెరిగాయి. అంతేకాకుండా దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ల కేసులు 1270కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ, ముంబైలలో ఓమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉంది.
పిల్లల కోసం టీకా అపాయింట్మెంట్లను నమోదు చేసుకునే విధానం
స్టెప్ 1: పిల్లల కోసం టీకాబుక్ చేసుకోవడం కోసం ముందుగా మీరు Cowin ప్లాట్ఫారమ్కి వెళ్లాలి.
స్టెప్ 2: ఇక్కడ మీరు పేరు మరియు వయస్సుతో సహా మీ పిల్లల సమాచారాన్ని అందివ్వవలసి ఉంటుంది.
స్టెప్ 3: దీని తర్వాత మీ యొక్క పిల్లల ఆధార్ లేదా 10వ తరగతి I కార్డ్ అందించాలి.
స్టెప్ 4: దీని తర్వాత ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది.
తల్లిదండ్రులు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు మరియు PCల ద్వారా టీకా స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. దేశంలోని వయోజన జనాభాలో 61 శాతం మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోస్లు ఇవ్వగా, వయోజన జనాభాలో 90 శాతం మందికి మొదటి డోస్ ఇవ్వబడింది. 15-18 సంవత్సరాల వయస్సు గల వారికి టీకాలు వేయడం పాఠశాలల్లో విద్యను సాధారణంగా అందించడానికి సహాయపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470