కోవిడ్-19 యూనివర్సల్ ట్రావెల్ e-పాస్ పొందడం ఎలా?
కోవిడ్ పాండమిక్ థర్డ్ వెబ్ని అందుబాటులోకి తీసుకొనివచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ యూనివర్సల్ ట్రావెల్ పాస్ రిజిస్ట్రేషన్ ఫారమ్ 2022ను ప్రారంభించింది. మహారాష్ట్ర కాకుండా అనేక ఇతర రాష్ట్రాలు కూడా యూనివర్సల్ ట్రావెల్ పాస్ ఫారమ్లను అమలు చేశాయి. ఇప్పుడు అవసరమైన సేవలలో నిమగ్నమైన వ్యక్తులు యూనివర్సల్ ట్రావెల్ పాస్ను పొందవచ్చు. ఇది వారిని స్వేచ్ఛగా ఒకచోటు నుంచి మరొక చోటుకి ప్రయాణించడానికి అనుమతిస్తుంది. మీరు ఆన్లైన్లో epassmsdma.mahit.org వెబ్ సైట్ ద్వారా యూనివర్సల్ ట్రావెల్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోని ఆపై కోవిడ్ పాస్ని పొందవచ్చు.

భారత రైల్వే మరియు మహారాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన కోవిడ్-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని పౌరులకు ప్రయాణం కోసం యూనివర్సల్ ట్రావెల్ పాస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు పౌరులు ఈ పాస్ కింద ఎలాంటి పరిమితి లేకుండా ప్రయాణించవచ్చు. కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క రెండు డోస్లను తీసుకున్న పౌరులందరూ మరియు రెండవ డోస్ స్వీకరించిన 14 రోజుల తర్వాత ప్రయాణించాలనుకునేవారు ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రయాణాల విషయంలో పౌరులు రాష్ట్ర ప్రభుత్వం నుండి యూనివర్సల్ పాస్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ ద్వారా వ్యాక్సిన్ స్టేటస్ ని ధృవీకరించిన తర్వాత ఈ పాస్ జారీ చేయబడుతుంది.

యూనివర్సల్ పాస్ లేని పౌరులకు టిక్కెట్లు తీసుకునే సౌకర్యం ఉండదని రైల్వే శాఖ మరియు ప్రభుత్వం ద్వారా స్పష్టం చేయబడింది. ఈ పాస్లో ఉన్న QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా సంబంధిత వ్యక్తికి సంబంధించిన అన్ని వివరాలు పొందబడతాయి. ఈ పాస్ టిక్కెట్లు పొందడంలో పౌరులకు సౌకర్యవంతమైన సేవను అందిస్తుంది.
దరఖాస్తు చేసుకునే విధానం

STEP1: మొదటగా మీరు https://epassmsdma.mahait.org/login.htm అధికారిక వెబ్సైట్ని ఓపెన్ చేయండి.
STEP2: ఇప్పుడు "యూనివర్సల్ పాస్" ఎంపిక మీద నొక్కండి. రెండుడోసుల టీకాలు వేసుకున్న పౌరులకు ఈ ఎంపిక అందుబాటులో ఉంది.
STEP3: ఇప్పుడు మీ ఫోన్ నంబర్ను నమోదు చేయండి ఆ తర్వాత మీకు OTP వస్తుంది.
STEP4: వెబ్సైట్ ఖాళీ వివరాలతో సహా అవసరమైన మొత్తం సమాచారాన్ని స్వయంచాలకంగా స్వీకరిస్తుంది.
STEP5: ఇప్పుడు యూనివర్సల్ ట్రావెల్ పాస్ కోసం దరఖాస్తు చేయడానికి Generate Pass ఎంపికపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications