మీ ఇంటి దగ్గర నుంచే సిమ్ ఆధార్ వెరిఫికేషన్, IVR ద్వారా..
మొబైల్ నంబర్ను మీ ఆధార్ నంబర్తో రీ-వెరిఫై చేసుకునేందుకు కేవలం రెండు నెలలే గడువు ఉందన్న విషయం తెలిసిందే.
మొబైల్ నంబర్ను మీ ఆధార్ నంబర్తో రీ-వెరిఫై చేసుకునేందుకు కేవలం రెండు నెలలే గడువు ఉందన్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్లుగానే ఆయా టెలికాం కంపెనీలు కస్టమర్లను ఆధార్తో మీ మొబైల్ నంబర్ను రీ-వెరిఫై చేసుకోవాలని కోరుతున్నాయి. దీని కోసం మీరు నెట్వర్క్కు చెందిన రిటైల్ స్టోర్లకు వెళ్లనవసరం లేకుంగా ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు ఐవీఆర్ సిస్టం తీసుకువచ్చింది. దీని ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు.

ప్టెప్ 1
మీ వెరిఫై చేసుకోవాల్సిన మొబైల్ నంబర్ నుంచి 14546కు కాల్ చేయాలి. అప్పుడు మీరు ఇండియనా లేదా ఎన్ఆర్ఐ కస్టమరా అని అడుగుతుంది. సమాధానం ఇచ్చి ఆ తర్వాత 1ని ప్రెస్ చేసి మీ ఆధార్ నంబర్ను పొందుపరచాలి.

ప్టెప్ 2
ఆధార్ నంబర్ను ఖరారు చేసుకోవడానికి మరొకసారి 1ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్కి ఒక వన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఇప్పుడు మీ ఫోన్ నంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ప్టెప్ 3
యూఐడీఏఐ డాటా బేస్ నుంచి మీ పేరు, ఫొటో, పుట్టినతేదీని మీ ఆపరేటర్ తీసుకోవడం మీకు ఇష్టమేనా అడుగుతుంది. దానికి మీరు సమాధానం ఇవ్వాలి.

ప్టెప్ 4
ఆ తరవాత మీ మొబైల్ నంబర్ చివరి నాలుగు అంకెలను ఎంటర్ చేసి ధ్రువీకరించుకోవాలి. ఇప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా మీకు మరో ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తరువాత చివరిగా ఆధార్-మొబైల్ నంబర్ రీ-వెరిఫికేషన్ను పూర్తిచేయడానికి 1ని ప్రెస్ చేయాలి.

ప్టెప్ 5
ఒకవేళ మీకు ఇంకో ఫోన్ నంబర్ ఉంటే 2ని ప్రెస్ చేసి మళ్లీ పైన పేర్కొన్న విధానం ద్వారానే దానికి కూడా ఆధార్ను లింక్ చేసుకోవాలి. ఈ సమయంలో మీ రెండో ఫోన్ నంబర్ కూడా ఆన్లో ఉండాలి. ఎందుకంటే దానికి కూడా ఓటీపీ వస్తుంది.

గమనిక
మీ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ 30 నిమిషాల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఈ లోపలే ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే ఈ ప్రక్రియను ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ యాక్టివేట్ చేశాయి. బీఎస్ఎన్ఎల్, జియో సంస్థలు యాక్టివేట్ చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








