నేషనల్ పెన్షన్ సిస్టమ్ అకౌంట్ ను ఆన్లైన్లో ఓపెన్ చేయాడం ఎలా ?
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)ను 2004లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదట ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ పథకం 2009 నుంచి పౌరులందిరికీ వర్తింపజేశారు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)ను 2004లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదట ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ పథకం 2009 నుంచి పౌరులందిరికీ వర్తింపజేశారు.ఇప్పటి వరకు ఆఫ్లైన్లో మాత్రమే ఉన్న ఈ సదుపాయాన్ని ఇప్పుడు ఆన్లైన్ చేసింది. ఈఎన్ఫీఎస్ పేరిట ప్రారంభమైన ఈ సిస్టమ్ ద్వారా పౌరులు ఆన్లైన్లోనే ఎన్పీఎస్ ఖాతా తెరుచుకోవచ్చు. టైర్ 1, టైర్ 2 అకౌంట్లలో మీ డబ్బును పొదుపు చేసుకోవచ్చు.18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసులోని వారు ఈ పథకంలో చేరవచ్చు. 70ఏళ్ల వరకు కొనసాగించవచ్చు.అయితే వ్యక్తిగత ఎన్పీఎస్ అకౌంట్ తెరవడానికి ప్రతి ఒక్కరికి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయంతో పాటు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. అలాగే మొబైల్ నంబర్తో రిజిస్టరై ఉన్న ఆధార్ నంబర్ ఉండాలి. ఫొటో స్కాన్ కాపీ, క్యాన్స్ల్డ్ చెక్, సంతకం, బ్యాంక్ అకౌంట్లో కనీసం రూ.500 డబ్బులు ఉండాలి. ఆన్లైన్లోనే ఈ ఖాతాను మరి ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం.

మొదట ఈఎన్పీఎస్ వెబ్సైట్కు వెళ్లాలి...
https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html. హోమ్ పేజ్లో కుడిచేతి వైపు ఉన్న ‘Registration' బటన్పై క్లిక్ చేయాలి.

సబ్స్క్రైబర్ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది....
ఆన్లైన్ సబ్స్క్రైబర్ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ను సెలక్ట్ చేసి, సంబంధిత విభాగాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి ‘Continue'పై క్లిక్ చేయాలి.

‘కంటిన్యూ’ మీద క్లిక్ చేసిన తరవాత.....
‘కంటిన్యూ' మీద క్లిక్ చేసిన తరవాత మీ పేరు, టైమ్ స్టాంప్తో కూడిన అక్నాలెడ్జ్మెంట్ నంబర్ జనరేట్ అవుతుంది. అప్పుడు ‘OK'ను సెలక్ట్ చేసుకోవాలి.

మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది....
ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వివరాలు మొత్తం నింపిన తరవాత ఒకసారి సరిచూసుకోండి. ఆ తరవాత ‘Save & Proceed'పై క్లిక్ చేయండి.

మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను నింపాల్సి ఉంటుంది....
ఆ తరవాత స్టెప్లో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను నింపాల్సి ఉంటుంది. మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్న బ్యాంక్ అకౌంట్ వివరాలను నింపి ‘Save & Proceed'పై క్లిక్ చేయాలి

వెబ్సైట్లో మీకు కనిపించే నాలుగు ఫండ్లను....
ఆ తరవాత స్టెప్లో, వెబ్సైట్లో మీకు కనిపించే నాలుగు ఫండ్లను ప్రాధాన్యత క్రమాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి. ఒక్కోదానిలో గరిష్టంగా 50 శాతం ఈక్విటీ ఫండ్స్ తీసుకునే అవకాశం ఉంది. కేటాయింపులు పూర్తయిన తరవాత, నామిని వివరాలు నింపాల్సి ఉంటుంది.

నామిని వివరాలు నింపిన తరవాత....
నామిని వివరాలు నింపిన తరవాత, మీ అకౌంట్ క్యాన్స్ల్డ్ చెక్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫొటోగ్రాఫ్, సంతకం కూడా అప్లోడ్ చేయాలి.

మీ ఎన్పీఎస్ అకౌంట్లో తొలి డిపాజిట్గా కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాలి.....
చివరిగా, మీ ఎన్పీఎస్ అకౌంట్లో తొలి డిపాజిట్గా కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ తొలి పేమెంట్ను ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు. అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.

పేమెంట్ విజయవంతంగా పూర్తైన తరవాత....
పేమెంట్ విజయవంతంగా పూర్తైన తరవాత, మీ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్) జనరేట్ అవుతుంది. అలాగే పేమెంట్ రిసిప్ట్ కూడా వస్తుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయడానికి.....
రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయడానికి లేదా రిజిస్ట్రేషన్ ఫామ్(ఈ సైన్)ను డౌన్లోడ్ చేసుకోవడానికి మీ ఆధార్ కార్డ్తో లింక్ చేసిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications








