పాన్తో ఆధార్ లింక్ చేశారా,నేటితో గడువు పూర్తి,ఎలా చేయాలో తెలుసుకోండి
పాన్ను ఆధార్ నంబర్తో అనుసంధానించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగిసిపోతోంది.
పాన్ను ఆధార్ నంబర్తో అనుసంధానించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగిసిపోతోంది. పాన్ను ఆధార్ నంబర్తో అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం 2018 జూన్ 30 వరకు గడువు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వం గడువును ఇప్పటికి నాలుగు సార్లు పొడిగించింది. ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయాలంటే అందుకు పాన్ను ఆధార్తో అనుసంధానించి ఉండాలి. ఇదిలా ఉంటే మరోసారి గడువు పొడిగింపు ఉంటుందా అన్నదానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అనుసంధానం కోసం ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్ సైట్ కు వెళ్లి పై భాగంలో కనిపించే లింక్ ఆధార్ ను ఎంచుకోవాలి. తర్వాత పేజీలో పాన్ నంబర్, ఆధార్ నంబర్ పేర్కొని 'లింక్ ఆధార్' ను క్లిక్ చేయాలి. ప్రాసెస్ ఓ సారి తెలుసుకోండి.

e-filling portalలో లాగిన్
మీరు ముందుగా ఇన్ కమ్ టాక్స్ e-filling portalలో లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ వివరాలతో అందులో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. లింక్ కోసం క్లిక్ చేయండి.

లాగిన్ కాగానే..
మీరు లాగిన్ కాగానే మీకు అక్కడ పాప్ అప్ విండో ఒకటి కనిపిస్తుంది. ఆధార్ లింక్ చేయమని అడుగుతుంది.

ఆధార్ నంబర్ తో పాటు పాన్ కార్డుకు సంబంధించిన వివరాలు
అక్కడ మీరు ఆధార్ నంబర్ తో పాటు పాన్ కార్డుకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Link Now
మీరు ఇచ్చిన వివరాలు కరెక్ట్ గా ఉంటే అక్కడ Link Now అనే ఆప్సన్ మీకు కనిపిస్తుంది.

మొబైల్ నంబర్
దాన్ని మీరు క్లిక్ చేయగానే మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. అది ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ కోడ్ వస్తుంది. దాంతో పాటు మీ మెయిల్ కి ఓ లింక్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఓటీపీ యాడ్ చేయాల్సి ఉంటుంది.

ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ అయిందంటూ మెసేజ్
ఆ ప్రాసెస్ అయిపోగానే మీకు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ అయిందంటూ మెసేజ్ కనిపిస్తుంది. మీ పని అయిపోయినట్లే.


Click it and Unblock the Notifications