Just In
- 3 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- 16 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 24 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 1 day ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
Don't Miss
- Lifestyle
World Cancer Day:పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్-రోబోటిక్ సర్జరీ ORసెక్స్ తో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చ
- News
దేశంలోనే తొలిసారి: గర్భం దాల్చిన ట్రాన్స్ జెండర్..మార్చిలో బిడ్డకు స్వాగతం!!
- Finance
Wheat: కేంద్ర ప్రభుత్వం చర్యలతో తగ్గిన గోధుమల ధర..
- Movies
వేణు మాధవ్ తల్లి షాకింగ్ కామెంట్స్: ఆ చెడ్డ అలవాటు వల్లే చనిపోయాడు.. చిన్న తప్పు ప్రాణం తీసిందంటూ!
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కచ్చితంగా పంట నష్టం అంచనా, తెలంగాణ సర్కార్ చేతిలో వినూత్న టెక్నాలజీ
పంట నష్టాన్ని త్వరితగతిన అంచనా వేయగలిగే వినూత్న టెక్నాలజీని తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టబోతోంది. దేశీయంగా తొలిసారిగా అమల్లోకి రాబోతోన్న ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 15 రోజులు, అంతకంటే తక్కువ సమయంలోపే పంట నష్టాన్ని అంచనా వేసే వీలుంటుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే భీమా కంపెనీలు వన్టైమ్ సెటిల్మెంట్ ప్రాసెస్లో రైతులకు పరిహారాన్ని చెల్లించే వీలుంటుంది.

టెక్నాలజీతో రైతులకు మరింత లబ్థి...
గతంలో ఈ ప్రాసెస్ జరగాలంటే స్థానిక అధికారులే వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేయాల్సి వచ్చేది. ఈ తతంగం మొత్తం పూర్తవటానికి నెలల తరబడి సమయం తీసుకునేది. ఈ మధ్యలో చోటుచేసుకునే జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవల్సి వచ్చేది. ఇటువంటి పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించేందుకు తెలంగాణ సర్కార్ ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

డ్రోన్ల సహాయంలో పర్యవేక్షణ
తెలంగాణ వ్యవసాయ శాఖ ఈ టెక్నాలజీని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించి చూసిింది. ఈ క్షేత్రంలో రబీ సీజన్లో చోటు చేసుకన్న పంట నష్టాన్ని డ్రోన్ల సమాయంతో అంచనా వేయగలిగారు. బెంగుళూరుకు చెందిన ఓ కంపెనీ తన సొంత ఖర్చులతో వ్యవసాయ శాఖకు ఈ టెక్నాలజీని పరీక్షించి చూపించింది.

పరిశోధనల నిమిత్తం 66 ఎకరాల సాగు భూమి..
ఈ ప్రయోగానికి కందుకూరు మండలంలోని నిడునురు గ్రామం వేదికగా నిలిచింది. ఈ గ్రామంలో 20 మంది రైతులకు చెందిన 66 ఏకరాల సాగు భూమిని పరిశోధనల నిమిత్తం వినియోగించుకున్నట్లు వ్యవసాయ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కూరగాయలు, పువ్వులుతో పాటు ఇతర ఆహార పంటలు పుష్కలంగా పండేందుకు ఈ నేల మరింత అనువుగా ఉందని ఆయన తెలిపారు.

త్వరలో తెలంగాణ అంతటా అమల్లోకి..
అత్యాధునిక టెక్నాలజీ, పొలాల్లో సాగవుతోన్న ఉన్న కాకరకాయి, వంకాయి, బీన్స్, టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి, గులాబీ, మామిడ, పత్తి, వరి, మొక్కజొన్న, గోదుమ, బెంగాల్ గ్రామ్ పంటకు సంబందించిన పంట(స్టాండింగ్ క్రాప్)లను క్యాప్చుర్ చేసింది.
పంట దిగుబడి, ధాన్యం రంగు మారటం, చీడపరుగుల బారినపడి పంట దెబ్బతినటం వంటి వివరాలను ఎప్పటికప్పడు ఈ టెక్నాలజీ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. ఈ నూతన పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాంటే గ్రామాల వారి భూముల వివరాలు, వాటి సారం, విస్తీర్ణం, నీటి లభ్యత, రైతుల సమాచారం వంటి వివరాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో సేకరించాల్సి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470