యాడ్కామ్ ఎ430+@రూ.3,399
భారత్ మార్కెట్లో తాజాగా ఎంట్రీ ఇచ్చిన మొబైల్ ఫోన్ ల తయారీ కంపెనీ యాడ్కామ్ (Adcom) ‘ఎ430+' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 4 అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉండే ఈ 3జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.3,399. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ ప్లాట్ ఫామ్, 4జీబి ఇంటర్నల్ ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబి ర్యామ్, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.

యాడ్కామ్ ఎ430+ కీలక స్పెసిఫికేషన్లు:
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
4 అంగుళాల డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ కనెక్టువిటీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








