ఈ తడవైనా ‘ఆల్కాటెల్’ దశ మారెనా..?

అంతర్జాతీయ మొబైల్ ఉత్పాదక సంస్థ ‘ఆల్కాటెల్’ గత కొద్ది సంవత్సరాలగా ఆకర్షణయమైన మొబైల్ హ్యాండ్సెట్లను అందిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికి, ఇతర మొబైల్ తయారీ కంపెనీలతో పోలిస్తే ‘ఆల్కాటెల్’ చురుకుగా లేదన్న వాదనలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ బ్రాండ్ ఆండ్రాయిడ్ ఆధారిత డ్యూయల్ సిమ్ ఫోన్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘ఆల్కాటెల్ బ్లేజ్ డ్యూ OT-918N’గా విడుదలైన ఈ డివైజ్ ముఖ్య విశేషాలు:
* డ్యూయల్ సిమ్ సపోర్ట్,
* ఆండ్రాయిడ్ 2.3 జింజర్బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* 650 MHz మెగా ప్రాసెసర్,
* 256 ఎంబీ ర్యామ్,
* 3.2 అంగుళాల స్ర్కీన్,
* 3మెగా పిక్సల్ కెమెరా,
* జీపీఎస్ సపోర్ట్,
* వై-ఫై,
* బ్లూటూత్ 3.0.
ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ సౌలభ్యతతో ‘3జి’ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. ఒకే స్లాట్లో రెండు సిమ్లు యాక్టివేట్ అయ్యే విధంగా టెక్నాలజీ వృద్ధి. ప్రస్తుతం ‘ఆల్కాటెల్ బ్లేజ్ డ్యూ OT-918N’ ఫిలిప్పిన్స్తో పాటు పలు ఆసియా ప్రాంతాల్లో రూ.7,000 ధరకు లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








