సెర్చ్ ఇంజన్ జెయింట్ గుగూల్ తాజాగా ఆవిష్కరించిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్’కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగోతోంది. ఈ ప్లాట్ఫామ్ వైపు అనేక స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఈ వోఎస్ ఆధారితంగా పనిచేసే తొలి ఘనతను గుగూల్ నెక్సస్ 7 (టాబ్లెట్) దక్కించుకుంది. జెల్లీబీన్ అప్డేట్తో ఆడ్వాన్సుడ్ ఫీచర్లను యూజర్లు ఆస్వాదించవచ్చు. రీసైజబుల్ విడ్జెట్స్, కస్టమైజబుల్ నోటిఫికేషన్స్, స్పీడ్ ఎన్హ్యాన్సిమెంట్స్, ఇంప్రూవుడ్ సెర్చ్ ఫీచర్స్, వాయిస్ రికగ్నిషన్ ఇంజన్ వంటి ప్రత్యేక వ్యవస్థలు స్మార్ట్ఫోన్లో అదనంగా వచ్చి చేరుతాయి. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ను త్వరలో పులుముకోనున్న 10 స్మార్ట్ఫోన్లు... ఫోటో గ్యాలరీ రూపంలో