అర్దరాత్రి 12 గంటలకు ఐఫోన్ 4ఎస్ విడుదల

న్యూఢిల్లీ: భారతదేశంలో యాపిల్ ఐఫోన్ 4ఎస్ ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న మొబైల్ అభిమానులకు శుభవార్త. అత్యాధునికి ఫీచర్స్ కలిగిన యాపిల్ ఐఫోన్ 4ఎస్ స్మార్ట్ ఫోన్ని దేశీయ మొబైల్ మార్కెట్లోకి తెచ్చినట్లు ఎయిర్ టెల్, ఎయిర్ సెల్ ప్రకటించాయి. యాపిల్ ఐఫోన్ 4ఎస్ని గురువారం అర్దరాత్రి 12గంటలకు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో ఆవిష్కరించడం జరిగింది.
ఇండియాలో ఐఫోన్ 4ఎస్ స్మార్ట్ ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి. 16జిబి మెమరీ కలిగిన ఐఫోన్ ఖరీదు సుమారు రూ 44,500, అదే 32జిబి కలిగిన ఐఫోన్ 4ఎస్ స్మార్ట్ ఫోన్ ఖరీదు సూమారుగా రూ 50,900గా నిర్ణయించారు.
64 మెమరీ సామర్ద్యం కలిగిన ఫోన్ ధర రూ
57,500 ఉంది.
ఇక ఫోన్ ప్రత్యేకతలను గనుక పరిశీలించినట్లేతే 8 మెగా ఫిక్సెల్ కెమెరా, 3.5 అంగుళాల మల్టీ టచ్ రెటీనా డిస్ప్లే, ఫేస్ డిటెక్షన్ దీని ప్రత్యేకత. సిరి పేరుతో కొత్త ఫీచర్ను సైతం పరిచయం చేశారు. ఫోన్కు ఏదైనా అడగడం ద్వారా కావాల్సిన సమాచారాన్ని పొందొచ్చు. ఉదాహరణకు దగ్గర్లో ఏ రెస్టారెంట్ ఉంది అని అడిగితే వెంటనే స్క్రీన్పై సమాచారం ప్రత్యక్షమవుతుంది.
‘ఐపోన్ 4ఎస్’ మొబైల్ ప్రత్యేకతలు:
చుట్టుకొలతలు: 115.2 x 58.6 x 9.3 mm
బరువు: 140 g
ఇంటర్నల్ మెమరీ: 16/32/64 GB storage, 512 MB RAM
కెమెరా: 8 MP, 3264×2448 pixels, autofocus, LED flash
ఆపరేటింగ్ సిస్టమ్: iOS 5
సిపియు: 1 GHz dual-core ARM Cortex-A9 processor, PowerVR SGX543MP2 GPU, Apple A5 chipset
బ్యాటరీ: Li-Po 1432 mAh
మెబైల్ లభించు కలర్స్: Black, White


Click it and Unblock the Notifications