ఆపిల్ ఐఫోన్ ఎస్ఈపై రూ. 8 వేలు తగ్గింపు, అమెజాన్లో మాత్రమే !
మొబైల్ దిగ్గజం ఆపిల్ ఈ మధ్య ఐఫోన్ల రేట్లను పెంచిన సంగతి అందరికీ తెలిసిందే.
మొబైల్ దిగ్గజం ఆపిల్ ఈ మధ్య ఐఫోన్ల రేట్లను పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆపిల్ ఐఫోన్లలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆపిల్ ఐఫోన్ ఎస్ఈని అతి తక్కువ ధరకు అమెజాన్ ఇండియాలో లభిస్తోంది. అమెజాన్ అధికారిక వెబ్సైట్లో రూ. 26,000 గల 32జీబీ వేరియంట్ను రూ. 8000లు తగ్గింపుతో కేవలం రూ. 17,999కే అమెజాన్ అందజేస్తోంది. అంతేకాకుండా ఈ అమ్మకంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ను కూడా అమెజాన్ ఇండియా అందజేస్తోంది.

ఐఫోన్ ఎస్ఈ ఫీచర్లు
4 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 640 x 1136 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.84 జీహెచ్జడ్ డ్యుయల్ కోర్ యాపిల్ ఎ9 ప్రాసెసర్, ఎం9 మోషన్ కోప్రాసెసర్
పవర్ వీఆర్ జీటీ7600 సిక్స్కోర్ గ్రాఫిక్స్
2 జీబీ ర్యామ్
16/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
1.2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఐఓఎస్ 9.3, సింగిల్ నానో సిమ్
ఎన్ఎఫ్సీ, 4జీ
4కె వీడియో రికార్డింగ్ సపోర్ట్, బ్లూటూత్ 4.2
యాపిల్ పే, టచ్ ఐడీ ఫింగర్ప్రింట్ సెన్సార్
1642 ఎంఏహెచ్ బ్యాటరీ

రోస్గోల్డ్, స్పేస్ గ్రే, గోల్డ్, సిల్వర్ రంగుల్లో..
కాగా ఈ ఫోన్ రోస్గోల్డ్, స్పేస్ గ్రే, గోల్డ్, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఫోన్ సైజు చిన్నగా ఉండి, అత్యుత్తమ పనితీరు కావాలనుకునే వారు ఈ ఫోన్ను ఎక్కువగా ఆదరించే అవకాశం ఉంది.

దిగుమతి పన్నుపెరిగినపుడు..
ఇటీవల దిగుమతి పన్నుపెరిగినపుడు ఇండియాలో ఐఫోన్ల ధరలను ఆపిల్ పెంచింది. అలాంటి సమయంలో అమెజాన్ ఈ ఆఫర్ అందించడం నిజంగా ఆహ్వానించదగ్గపరిణామమేనని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

షియోమి మిస్టరీ
షియోమి మిస్టరీ, ఫోన్లను అంత తక్కువ ధరకే ఎలా ఇస్తోంది..?


Click it and Unblock the Notifications








