స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి దూసుకొస్తున్న అసుస్ జెన్ఫోన్ 5Z
మొబైల్ దిగ్గజం అసుస్ ఇండియాలో మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతుంది. "జెన్ఫోన్ 5Z " అనే పేరు తో అసుస్ కంపెనీ విడుదల చేయనుంది .
మొబైల్ దిగ్గజం అసుస్ ఇండియాలో మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతుంది. "జెన్ఫోన్ 5Z " అనే పేరు తో అసుస్ కంపెనీ విడుదల చేయనుంది.అయితే ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభ్యంకానుంది. 6 జీబీ ర్యామ్/ 64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.29,999గా, 6 జీబీ ర్యామ్/ 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.32,999గా, 8 జీబీ ర్యామ్/ 256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.36,999గా కంపెనీ నిర్ణయించింది . జెన్ఫోన్ 5Z స్మార్ట్ఫోన్స్ జూలై 9 నుంచి కేవలం ఫ్లిప్కార్ట్లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది:
మొదటి వేరియంట్ (6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్) ధర రూ.29,999. రెండవ వేరియంట్ (6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్) ధర రూ.32,999. మూడవ వేరియంట్ (8జీబి ర్యామ్ + 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్) ధర రూ.36,999 గా కంపెనీ నిర్ణయించింది.

డిస్ప్లే:
ఈ స్మార్ట్ ఫోన్ 6.2 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తోంది. స్క్రీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1280 x 720పిక్సల్స్. అయితే అసుస్ కంపెనీ నుంచి నాచ్ డిస్ప్లేతో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే.

కెమెరా:
ఈ స్మార్ట్ఫోన్ కెమెరాను పరిశీలించినట్లయితే ఫోన్ ప్రైమరీ కెమరా 12,8 మెగా పిక్సల్ గాను, సెకండరీ కెమెరా 8 మెగా పిక్సల్ గానూ ఉంటుంది. పనితీరును విషయానికి వచ్చేసరికి ఈ కెమెరాలు ఏ కండీషన్స్లో అయిన క్వాలిటీ పనితీరును కనబరుస్తుంది.ఫుల్ హెచ్డి రిసల్యూషన్తో చిత్రీకరించే విడియోలు ఆకట్టుకుంటాయి.

బ్యాటరీ :
ఈ స్మార్ట్ ఫోన్ 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది . ఫుల్ చార్జ్ పై దాదాపు 2 రోజుల స్టాండ్ బై టైమ్ను ఈ బ్యాటరీ అందించగలుగుతుంది. ఈ ఫోన్ జూలై 9 నుంచ ఫ్లిప్కార్ట్ లో మాత్రం అందుబాటులో ఉంటుంది.

ఆండ్రాయిడ్ పి అప్డేట్ అస్యూరెన్స్తో
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం తో డివైస్ తో రన్ అవుతుంది అయితే కంపెనీ మాత్రం ఆండ్రాయిడ్ పి అప్డేట్ అసురన్సు ఇస్తుంది.


Click it and Unblock the Notifications








