రూ.499కే Redmi Note 4 ఫోన్..?
రూ.12,999 ఖరీదు చేసే రెడ్మీ నోట్ 5 ఫోన్ను రూ.499కే ఇచ్చేస్తున్నారట...
ఇంటర్నెట్లోకి కొత్త కొత్తగా పట్టుకొస్తున్న కొన్ని వెబ్సైట్లు నెటిజనులను మోసం చేయటమే లక్ష్యంగా పనిచేస్తు్న్నాయి. వాటిలో ఒకటైన http://mi-offers.com/ షియోమీ రెడ్మీ నోట్ 4 స్మార్ట్ఫోన్ను కేవలం రూ.499కే అందిస్తున్నట్లు చెబుతుతోంది. ఇటువంటి నకిలీ ఈ-కామర్స్ వెబ్సైట్లను గూగుల్ ఎప్పటికప్పుడు నిరోధిస్తున్నప్పటికి కొన్ని లూప్ హోల్స్ ఆధారంగా చేసుకుని చెకింగ్లను హ్యాకర్లు బైపాస్ చేయగలుగుతున్నారు.

నకిలీ అమెజాన్ లోగోను తయారు చేసుకున్న ఈ సైట్ రూ.12,999 ఖరీదు చేసే రెడ్మీ నోట్ 4 ఫోన్ను రూ.499కే ఇస్తున్నామని చెప్పుకుంటోంది. ఆవేశపడి ఈ ఆఫర్ పై క్లిక్ చేసినట్లయితే హ్యాకర్లు హానికర ప్రోగ్రామ్ను మీ డివైస్ల్లోకి ప్రవేశపెట్టి మీ ఫోన్ లేదా కంప్యూటర్లోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించటంతో పాటు బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్లను కూడా లూటీ చేసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications