రూ.97కే నెలంతా అపరిమిత డేటా, అన్లిమిటెడ్ కాల్స్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. జియో, ఎయిర్టెల్లాంటి సంస్థలు మార్కెట్లో దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రభుత్వరంగ దిగ్గజం BSNL 28 రోజులకే అపరిమిత కాలింగ్ , డేటానే ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్లాన్లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.

ఆఫర్ వర్తించాలంటే..
ఈ ఆఫర్ వర్తించాలంటే రూ.2,200(జీఎస్టీతో కలిపి రూ.2,450) స్మార్ట్ఫోన్(మైక్రోమాక్స్)తో కలిపి సిమ్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

రూ.97తో రీఛార్జ్ చేసుకుంటే
ఆ తర్వాత రూ.97తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులకు అన్లిమిటెడ్ కాలింగ్, డేటా, నేషనల్ రోమింగ్ను ఉచితంగా అందుతాయి.

జియో, ఎయిర్టెల్లకు దీటుగా..
జియో, ఎయిర్టెల్లకు దీటుగా వినియోగదారులకు తక్కువ ధరకే అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ సేవలను అందిస్తున్నామని ఈ సందర్భంగా బీసీఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎ.పూర్ణచంద్రరావు తెలిపారు.

గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు..
గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు పేద, మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఈ ఆఫర్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం ఈ ఫోన్ను అన్ని రిటైల్ షాప్ల్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








