BSNL సంచలనం : రూ.499కే ఫీచర్ మొబైల్, 365 రోజుల వ్యాలిడిటీ కనెక్షన్
దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో సంచలనానికి తెరలేపింది.
దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో సంచలనానికి తెరలేపింది. అత్యంత తక్కువ ధరకే మొబైల్ను అందించే దిశగా అడుగులు వేసింది.దీంతో పాటు ప్రపంచంలోనే అత్యంత చవకైన మొబైల్ తయారీ సంస్థగా పేరు గాంచిన డిటెల్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా పలు బండిల్ ఆఫర్లతో రూ.499కే అత్యంత చవకైన మొబైల్ని అందిచనుంది.

సంవత్సరం పాటు..
రూ. 499తో డీటెయిల్ డీ1 మొబైల్ ని పొందే వినియోగదారులు సంవత్సరం పాటు ఆఫర్లతో కూడిన బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ పొందుతాడు. దీంతో పాటు వినియోగదారుడికి ఉచితంగా 28 రోజుల వరకు రింగ్బ్యాక్ టోన్ సౌకర్యం కల్పించారు.

రూ..103 టాక్టైమ్ ..
ఈ ఆఫర్లో భాగంగా వినియోగదారులకు రూ..103 టాక్టైమ్ లభిస్తుంది. అలాగే బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్కు ప్రతి నిమిషానికి 15 పైసలు, బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్వర్క్లకు నిమిషానికి 40 పైసలు కాల్రేట్స్ ఉంటాయి.

డిటెల్ డీ1 ఫీచర్లు
1.44 అంగుళాల తెర,
650 ఎంఏహెచ్ బ్యాటరీ
సింగిల్ సిమ్
టార్చ్లైట్,
ఫోన్బుక్,
ఎఫ్ఎం రేడియో,
స్పీకర్, వైబ్రేషన్ మోడ్

తక్కువ ధరలో మెరుగైన సేవలు
ఫోన్ లాంచ్ చేస్తూ వినియోగదారులకు తక్కువ ధరలో మెరుగైన సేవలు అందించేందుకు తామంతా కృతనిశ్చయంతో ఉన్నట్టు బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు.

దేశంలోని నలుమూలల..
దేశంలోని నలుమూలల తమ నెట్వర్క్ను విస్తరించాలన్న ధ్యేయంతో ముందుకు పోతున్నట్టు వారు పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ ఇక ఎంతమాత్రమూ విలాసవంతమైంది కాదని చెప్పడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








