1 జిబి ర్యామ్, 5 ఎంపీ కెమెరా ఫోన్,రూ.3,499కే
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఐవూమీ గురువారం భారత మార్కెట్లోకి బడ్జెట్ ధరల్లో రెండు స్మార్ట్ఫోన్లు విడుదల చేసింది.
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఐవూమీ గురువారం భారత మార్కెట్లోకి బడ్జెట్ ధరల్లో రెండు స్మార్ట్ఫోన్లు విడుదల చేసింది. మీ4, మీ5 పేర్లతో విడుదల చేసిన ఈ ఫోన్లు ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

డిస్ప్లే
ఫీచర్ల విషయానికి వస్తే మీ4లో 4.5 అంగుళాల డిస్ప్లే ఉండగా, మీ5లో 5 అంగుళాల 2.5డీ కర్వ్డ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే ఉంది.

ఆండ్రాయిడ్ 7.0
రెండు ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్ను ఉపయోగించారు.

కెమెరాలు
ఇక మీ4లో 1జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 64 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, ముందు, వెనక 5 ఎంపీ కెమెరాలు ఉన్నాయి.

ర్యామ్
మీ5లో 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, వెనక 8 ఎంపీ, ముందు 5 ఎంపీ కెమెరా ఉన్నాయి.

ధర
ధరల విషయానికొస్తే మి4 ధర రూ.3,499గానూ, మి5 ధర 4,499గానూ నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








