త్వరలో నరేంద్రమోడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్!
టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు భారత్ను అనూహ్య రీతిలో అభివృద్ధిపరుస్తున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర అంశం వెబ్ ప్రపంచంలో హల్చల్ చేస్తోంది. చైనా ఆధారిత కంపెనీ స్మార్ట్నమో (SmartNaMo) నమో (నరేంద్ర మోడీ) బ్రాండ్ పేరుతో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కంపెనీని గుజరాత్కు చెందిన పలువురు వ్యాపారవేత్తాలు స్థాపించటం విశేషం. ఫీచర్ ఫోన్లతో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను ఈ కంపెనీ తయారు చేయనుంది. ఆగష్టు చివరి నాటికి ఈ ఫోన్లు మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

స్మార్ట్నమో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్లు:
5 అంగుళాల స్ర్కీన్,
హైడెఫినిషన్ ఐపీఎస్ ప్యానల్ డిస్ప్లే (రిసల్యూషన్ 1920x 1080పిక్సల్స్),
గొరిల్లా గ్లాస్2 ప్రొటెక్షన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇన్-బుల్ట్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత.


Click it and Unblock the Notifications







