ఆ మొబైల్ కొంటే వన్ ఇయర్ ఇంటర్నెట్ ఫ్రీ
డేటావిండ్ కంపెనీ వినియోగదారుల కోసం అద్బుతమైన ఆఫర్ ని ప్రకటించింది. అత్యంత తక్కువ ధరలో మొబైల్ ని లాంచ్ చేయడమే కాకుండా దానికి వన్ ఇయర్ ఫ్రీ ఇంటర్నెట్ కూడా ఇస్తోంది.టెక్నాలజీలో ఓ కొత్త ట్రెండ్ని సృష్టించేందుకు సిద్ధమైన డేటావిండ్ కంపెనీపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

ఆ మొబైల్ కొంటే వన్ ఇయర్ ఇంటర్నెట్ ఫ్రీ
తక్కువ బడ్జెట్లో టాబ్లెట్లను ఆవిష్కరించే కంపెనీగా పేరున్న డేటావిండ్, తాజాగా తన కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.1,499కే కస్టమర్లకు అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది.

ఆ మొబైల్ కొంటే వన్ ఇయర్ ఇంటర్నెట్ ఫ్రీ
ఈ ఫోన్తో పాటు ఏడాది పాటు ఉచిత ఇంటర్నెట్ బ్రౌజింగ్ సౌకర్యాన్ని కూడా వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించింది.

ఆ మొబైల్ కొంటే వన్ ఇయర్ ఇంటర్నెట్ ఫ్రీ
స్మార్ట్ఫోన్ ధరలను తగ్గిస్తూ.. టెక్నాలజీని సరసమైన ధరల్లో యూనివర్స్ల్గా అందించేందుకు దృష్టిసారించామని డేటావిండ్ సీఈవో సునీత్ సింగ్ తులి చెప్పారు.

ఆ మొబైల్ కొంటే వన్ ఇయర్ ఇంటర్నెట్ ఫ్రీ
టచ్ స్క్రీన్, రేర్ కెమెరా, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఈ ఫోన్ కలిగి ఉంది. అయితే పాకెట్ సర్ఫర్ జీజడ్కు సంబంధించిన మిగతా ఫీచర్లను కంపెనీ తెలుపలేదు.

ఆ మొబైల్ కొంటే వన్ ఇయర్ ఇంటర్నెట్ ఫ్రీ
తాజాగా లాంచ్ చేసిన పాకెట్ సర్ఫర్ జీజడ్ ఒక్కటే కంపెనీ నుంచి వెలువడిన బడ్జెట్ స్మార్ట్ఫోన్ కాదు.

ఆ మొబైల్ కొంటే వన్ ఇయర్ ఇంటర్నెట్ ఫ్రీ
పాకెట్ సర్ఫర్ 2జీ4ఎక్స్, పాకెట్ సర్ఫర్ 3జీ4ఎక్స్, పాకెట్ సర్ఫర్ 3జీ5, పాకెట్ సర్ఫర్ 3జీ4జడ్ స్మార్ట్ఫోన్లను కూడా కంపెనీ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంతో బడ్జెట్ ధరల్లో మార్కెట్లోకి ఆవిష్కరించింది.

ఆ మొబైల్ కొంటే వన్ ఇయర్ ఇంటర్నెట్ ఫ్రీ
ఫ్రీడం 251 తర్వాత డేటావిండ్స్ పాకెట్ సర్ఫర్ జీజడ్ స్మార్ట్ఫోనే చాలా చౌకైన మొబైల్. ఐడీసీ డేటా ప్రకారం డేటావిండ్ తక్కువ ధరల్లో టాబ్లెట్లను అందించడంలో మార్కెట్ లీడర్గా ఉంది.

ఆ మొబైల్ కొంటే వన్ ఇయర్ ఇంటర్నెట్ ఫ్రీ
కంపెనీ టాబ్లెట్ల రవాణా 2016 తొలి త్రైమాసికంలో 33.5 శాతం పెరిగి, 27.6 శాతం మార్కెట్ షేరును డేటావిండ్ దక్కించుకుంది. మొత్తంగా టాబ్లెట్ మార్కెట్ భారత్లో ఫ్లాట్గా ఉంది.


Click it and Unblock the Notifications








