వస్తోంది... వచ్చే వారంలో!

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రముఖ కొరియన్ స్మార్ట్ఫోన్ మేకర్ ఎల్జీ, ఇండియన్ మార్కెట్లో వచ్చే వారం సరికొత్త స్మార్ట్ఫోన్ను ప్రవేశపెట్టనుంది. విడుదల కాబోతున్న ఈ డివైజ్ జపాన్, కొరియా దేశాలకే పరిమితమైన ‘ఆప్టిమస్ వీయూ’(Optimus Vu) అయి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గడిచిన జూలైలో ఎల్జీ.. ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్డి, ఎల్3, ఎల్5, ఎల్7 మోడళ్లలో పలు స్మార్ట్ఫోన్లను భారత్లో విడుదల చేసింది. ముందుగా ఎల్జీ ‘ఆప్టిమస్ వీయూ’ను 2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో ప్రకటించారు. ఆ తురవాత బార్సిలోనా వేదిక పై ప్రదర్శించారు.
ఎల్జీ ఆప్టిమస్ వీయూ ఫీచర్లు:
5 అంగుళాల ఎక్స్జీఏ- ఐపీఎస్ కెపాసిటివ్ టచ్స్ర్కీన్ డిస్ప్లే(రిసల్యూషన్ 768 x 1024పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ఎన్-విడియా టెగ్రా 3ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (హెచ్డిఎమ్ఐ పోర్ట్, డీఎల్ఎన్ఏ, వై-ఫై, బ్లూటూత్),
2080ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








