20 ఎంపీ సెల్ఫీ కెమెరాతో...
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ జియోనీ మరో కొత్త ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ జియోనీ మరో కొత్త ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. సెల్ఫీ ప్రియుల కోసం ప్రత్యేకంగా 20 మెగాపిక్సెల్ ముందు కెమెరాతో జియోనీ ఏ1 లైట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. దీని ధర రూ.14,999గా నిర్ణయించింది.ఆగస్టు 10 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీని ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

5.3 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.0,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








