అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఈ నెల 29న గూగుల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన ఆండ్రాయిడ్ ఈవెంట్, శాండీ తుఫాన్ కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో గూగుల్ తన సరికొత్త డివైజ్ల వివరాలను అఫీషియల్ బ్లాగ్ ద్వారా బహిర్గతం చేసింది. అధికారిక గూగుల్ బ్లాగ్ ద్వారా గూగూల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ రూబిన్, ఎల్జీ నెక్సస్ 4 (స్మార్ట్ఫోన్), గూగుల్ నెక్సస్ 7 (32జీబి వర్షన్ టాబ్లెట్), సామ్సంగ్ నెక్సస్ 10 (టాబ్లెట్) ఇంకా ఆండ్రాయిడ్ 4.2వోఎస్లకు సంబంధించిన కీలక వివరాలను ప్రకటించారు.