త్వరలో ఐబాల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్

ఐబాల్ విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మైక్రోమ్యాక్స్ ఏ70 మాదిరి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఇండియన్ కస్టమర్స్ ఆండ్రాయిడ్ మొబైల్స్పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇటీవలే స్పైస్ కంపెనీ స్పైస్ ఎమ్ఐ310 పేరుతో ఆండ్రాయిడ్ మొబైల్ పోన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐబాల్ విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ మొబైల్ పోన్ ధర సుమారుగా రూ 6000 నుండి రూ 7000 మద్యలో ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు.
2.2 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్సన్తో పాటు యూజర్స్ చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్ని అందించేందుకు గాను 2.3 ఇంచ్గా స్క్రీన్ సైడు డిస్ ప్లేని రూపోందించడం జరిగింది. ఐబాల్ విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ సుమారుగా 20గంటలు పాటు టాక్ టైమ్ని అందించనున్నాయని సమాచారం. ఇక నెట్ వర్క్ విషయానికి వస్తే 2జీ, 3జీ రెండు నెట్ వర్క్ లను సపోర్ట్ చేయనున్నాయి. ఇప్పటికే ఐబాల్ కంప్యూటర్స్ ఉత్పత్తులను విడుదల చేయడంలో దేశంలోనే నెంబర్ వన్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications