Just In
- 6 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 9 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 12 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 14 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్టాప్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బెంగుళూరులో ఐపోన్ 6ఎస్ ప్లస్ తయారీ, ధర భారీగా తగ్గే అవకాశం !
మొబైల్ దిగ్గజం ఆపిల్ కంపెనీ మేడ్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఐఫోన్ ఎస్ఈతో ఇండియాలో తయారీ రంగాన్ని ప్రోత్సాహిస్తున్న ఈ కంపెనీ త్వరలో మరో స్మార్ట్ ఫోన్ కూడా ఇండియాలోనే తయారుచేసేందుకు తయారుగా ఉందనే వార్తలు వస్తున్నాయి. కాగా ఆపిల్ భారత్లో తయారు చేస్తున్న ఏకైక ఫోన్ ఐఫోన్ ఎస్ఈ మాత్రమేనన్న సంగతి తెలిసిందే. దీని సరసన ఇప్పుడు మరో స్మార్ట్ఫోన్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ కూడా చేరబోతోంది. ఆపిల్ మరో రెండు వారాల్లో ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్మార్ట్ఫోన్ను బెంగళూరులో తయారుచేయడం ప్రారంభించబోతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే దీని ట్రయల్ ప్రొడక్షన్ను ప్రారంభించినట్టు తెలిపాయి. దీంతో ఐఫోన్ 6ఎస్ ప్లస్ ధరను ఆపిల్ 5 శాతం నుంచి 7 శాతం మేర తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్లో అత్యంత పాపులర్ అయిన ఐఫోన్లలో ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఒకటిగా నిలిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ ట్రయల్ ప్రొడక్షన్ను బెంగళూరులోని విస్ట్రోన్లో ఆపిల్ ప్రారంభించేసింది. పూర్తిగా తయారీ ప్రారంభించిన అనంతరం వెంటనే ఈ స్మార్ట్ఫోన్ ధర తగ్గుదలను కంపెనీ చేపట్టకుండా, స్థానిక సామర్థ్యం పెంచిన తర్వాతనే ధరల తగ్గుదలను చేపడుతుందని ఓ సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ చెప్పారు. భారత్ మార్కెట్కు అవసరమైన డిమాండ్ను వెంటనే విస్ట్రోన్ చేరుకోలేకపోవడమే దీనికి కారణమన్నారు. చైనా నుంచి ఈ ఫోన్ దిగుమతులు కొనసాగుతాయని తెలిపారు.
కాగ, గతేడాది మే నుంచి ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్ను ఆపిల్ భారత్లో రూపొందిస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం అత్యంత తక్కువగా రూ.18,799కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్కు ఇప్పటికీ మంచి స్పందన వస్తోంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్లో రూ.37,999కు లభ్యమవుతోంది. ఇది ఇండియాలో తయారయితే తగ్గే అవకాశం ఉంది. ఆపిల్ ప్రస్తుతం ఫ్లెక్స్, ఫాక్స్కాన్, విస్ట్రోన్ వంటి తయారీ కంపెనీలతో చర్చలు జరుపుతోందని, దీంతో తన స్థానిక సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటుందని ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్లు చెప్పారు. ఛార్జర్లు, అడాప్టర్లు, ప్యాకింగ్ బాక్స్ల తయారీని కూడా భారత్లోనే ఆపిల్ చేపట్టబోతుందని తెలుస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470