తుఫానుల అంచనాలో కొత్త విప్లవం.. ఇస్రో EOS-05 సక్సెస్, ఇకపై 5 నిమిషాలకో అప్డేట్!
ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన EOS-05 శాటిలైట్ నిర్దేశిత జియోసింక్రోనస్ కక్ష్యలోకి విజయవంతంగా చేరుకుంది. సెప్టెంబర్ 7 రాత్రి 8:57 గంటలకు దీని చివరి ఇంజిన్ బర్న్ ప్రక్రియ పూర్తయింది. ఈ కక్ష్య నుంచి భారత్ భూభాగాన్ని నిరంతరం గమనిస్తూ, వేగంగా చిత్రాలను తీసే వెసులుబాటు దీనికి ఉంటుంది. దీంతో ఈ వారంలోనే మరింత స్పష్టమైన వాతావరణ సమాచారం, తుఫానుల తాజా విజువల్స్ అందుబాటులోకి రానున్నాయి.
EOS-05 ఉపగ్రహాన్ని కేవలం పాయింట్-టు-పాయింట్ ఇమేజింగ్ కోసమే కాకుండా, వేగంగా, నిరంతరాయంగా డేటా అందించేలా రూపొందించారు. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు, ఇది కీలక ప్రాంతాల చిత్రాలను ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి తీయగలదు. అలాగే సుమారు 42-మీటర్ల రెజల్యూషన్తో ప్రతి అర గంటకోసారి ఇరు తెలుగు రాష్ట్రాలు సహా దేశం మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. ఇప్పటికే సేవలు అందిస్తున్న ఇన్సాట్-3డి (INSAT-3D/3DR) ప్రతి 15 నిమిషాలకు, తుఫానుల సమయంలో ప్రతి 6 నిమిషాలకు స్కాన్ చేస్తుండగా... దీనికి EOS-05 మరింత అదనపు బలాన్ని ఇస్తుంది. అయితే ప్రజలకు అధికారికంగా డేటా అందుబాటులోకి రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది.

వెదర్ యాప్స్, తుఫాను హెచ్చరికలకు EOS-05తో ఏం మారనుంది?
రియల్-టైమ్ ఆప్టికల్ ఇమేజింగ్ వల్ల వర్షపాత అంచనాలు, పిడుగులు పడే అవకాశాలు, దుమ్ము తుఫానులు, ముఖ్యాతి ముఖ్యంగా తుఫాను 'కన్ను' (ఐ) నిఖార్సయిన లొకేషన్ను మరింత స్పష్టంగా గుర్తించవచ్చు. దీనివల్ల బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, తుఫానుల కదలికలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు తీర ప్రాంతాలు సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ మాట్లాడుతూ... "కక్ష్యలో EOS-05 పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, జియో ఆర్బిట్ నుంచి కీలకమైన వ్యూహాత్మక సమాచారాన్ని అందించే భారత్ తొలి డెడికేటెడ్ ఇమేజింగ్ ఉపగ్రహంగా ఇది నిలుస్తుంది" అని పేర్కొన్నారు.
| ఏం మారుతుంది? | ఇంతకుముందు (సాధారణంగా) | EOS‑05తో | ఎందుకు కీలకం? |
|---|---|---|---|
| డేటా అప్డేట్ వ్యవధి | 15 నిమిషాల లూప్లు; 6 నిమిషాల రాపిడ్ స్కాన్లు | కీలక ప్రాంతాలకు 5 నిమిషాలు; దేశమంతటికీ 30 నిమిషాలు | తుఫానుల తీవ్రతను త్వరగా గుర్తించవచ్చు |
| ఇమేజ్ స్పష్టత | సాధారణ IR/విజిబుల్ కాంపోజిట్లు | సుమారు 42-మీటర్ల మల్టీస్పెక్ట్రల్/హైపర్స్పెక్ట్రల్ | మేఘాల అంచులు, దుమ్ము, పొగ స్పష్టంగా కనిపిస్తాయి |
| ముందుగా ఎక్కడ చూడవచ్చు? | IMD RAPID/ఇన్సాట్ పేజీలు | MOSDACలో టెస్ట్ లేయర్లు; తర్వాత యాప్లలో | వాతావరణ మార్పులను వేగంగా గమనించవచ్చు |
ఈ సేవలను ప్రత్యక్షంగా చూడాలనుకుంటే మూడు అధికారిక డాష్బోర్డ్లను ఫాలో అవ్వవచ్చు. మొదటిది MOSDAC లైవ్ — ఇందులో కొత్త జియో-ఇమేజింగ్ లేయర్లు, వేగవంతమైన లూప్లను చూడవచ్చు. రెండవది IMD RAPID వీవర్ — దీని ద్వారా మేఘాల కదలికలు, నావ్కాస్ట్ అప్డేట్లను గంటల వ్యవధిలో పోల్చి చూడవచ్చు. మూడవది భువన్ (Bhuvan) — టెస్టింగ్ సమయంలో అందుబాటులోకి వచ్చే ప్రయోగాత్మక EO లేయర్లు, విపత్తుల దృశ్యాలను ఇక్కడ గమనించవచ్చు.
వెదర్ యాప్స్ సజావుగా పనిచేయాలంటే... మీ స్మార్ట్ఫోన్లో ఉండాల్సిన ఫీచర్లు ఇవే!
సాధారణ ఇమేజ్ల కంటే ఈ వేగవంతమైన, భారీ శాటిలైట్ లూప్లను లోడ్ చేయడం వల్ల ఫోన్లపై భారం పడుతుంది. వీటిని బయట స్పష్టంగా చూడటానికి మంచి బ్రైట్నెస్ ఉన్న డిస్ప్లే, యానిమేషన్లు స్మూత్గా రన్ అవ్వడానికి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటే మంచిది. ఇక ఎక్కువ సేపు రాడార్ లేదా శాటిలైట్ మ్యాప్లను చూసేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 5,000 mAh బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్ అవసరం. ముఖ్యంగా తుఫానుల సమయంలో భారీ డేటాను వేగంగా లోడ్ చేయడానికి 8 GB RAM, ఫాస్ట్ UFS స్టోరేజ్ ఉన్న స్మార్ట్ఫోన్లు అయితే భేషుగ్గా పనిచేస్తాయి.
రాబోయే 48 నుంచి 72 గంటల్లో మొదటగా ప్రయోగాత్మక చిత్రాలు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత EOS-05 శాటిలైట్ తన నిర్దేశిత పొజిషన్కు చేరుకుని చెకప్లు పూర్తయ్యాక డేటా స్ట్రీమింగ్ స్థిరపడుతుంది. భవిష్యత్తులో బంగాళాఖాతంలో ఏదైనా తుఫాను ఏర్పడినప్పుడు, మెగాపిక్సల్స్ లేదా ప్రాసెసర్ స్పీడ్ కంటే ఈ 5 నిమిషాల అప్డేట్ వ్యవధే చాలా కీలకంగా మారనుంది. థర్డ్ పార్టీ యాప్లలోకి డేటా వచ్చే కంటే ముందే తాజా సమాచారం కోసం IMD పోర్టల్స్, MOSDAC వెబ్సైట్లను చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications
