జియో ఫోన్ యూజర్లకు శుభవార్తను అందించిన ముఖేష్ అంబాని
దేశీయ మొబైల్ మార్కెట్లో సత్తా చాటేందుకు పావులు కదుపుతున్న జియో యూజర్ల కోసం అత్యంత తక్కువ ధరలో జియో ఫీచర్ ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
దేశీయ మొబైల్ మార్కెట్లో సత్తా చాటేందుకు పావులు కదుపుతున్న జియో యూజర్ల కోసం అత్యంత తక్కువ ధరలో జియో ఫీచర్ ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. జియో ఫోన్ కొనుగోలు దారులు ఇప్పుడు వాడుతున్న 153 రూపాయల ప్రీపెయిడ్ ప్యాక్ను అప్గ్రేడ్ చేస్తున్నట్టు జియో ప్రకటించింది. ఈ అప్గ్రేడ్ చేసిన ప్యాక్ కింద జియో రోజుకు 1జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. దీంతో పాటు మరిన్ని బెనిఫిట్స్ కూడా లభించే అవకాశం ఉంది.

రోజుకు 1జీబీ 4జీ హై స్పీడ్ డేటా..
ఈ ప్యాక్ కింద రోజుకు 1జీబీ 4జీ హై స్పీడ్ డేటాతో పాటు, అపరిమిత వాయిస్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, రోమింగ్), రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్ని జియో యాప్స్కు ఉచిత సబ్స్క్రిప్షన్ను 28 రోజుల పాటు అందించనున్నట్టు తెలిపింది.

అంతకముందుకు..
కాగా రిలయన్స్ జియో అప్గ్రేడ్ చేసిన రూ.153 ప్యాక్ కింద అంతకముందుకు రోజుకు 500 ఎంబీ 4జీ హైస్పీడ్ డేటా మాత్రమే లభ్యమయ్యేది. అపరిమిత వాయిస్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, రోమింగ్), రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభించేవి.

అదనంగా మరో రెండు శాచెట్ ప్యాక్స్ ..
వీటితో పాటు జియో ఫోన్ యూజర్లకు అదనంగా మరో రెండు శాచెట్ ప్యాక్స్ రూ.24, రూ.54 ప్యాక్స్ అందుబాటులోకి వచ్చాయి. రూ.24 ప్యాక్ ద్వారా రోజుకు 500 ఎంబీ హై స్పీడ్ డేటా, 20 ఎస్ఎంఎస్లు, జియో యాప్స్ యాక్సస్ను రెండు రోజుల పాటు లభ్యమవనున్నాయి. రూ.54 ప్యాక్ ద్వారా ఏడు రోజుల పాటు పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు 70 ఎస్ఎంఎస్లు వస్తాయి.

రూ.149 ప్యాక్పై కూడా ..
జియోఫోన్కు చెందిన రూ.153 ప్రీపెయిడ్ ప్యాక్కు అందించే ప్రయోజనాలే, 4జీ స్మార్ట్ఫోన్లకు చెందిన రూ.149 ప్యాక్పై కూడా జియో అందిస్తోంది.

రూ.309 నెలవారీ ప్యాక్తో ..
మరో రూ.309 నెలవారీ ప్యాక్తో జియోటీవీ, జియో సినిమా వంటి యాప్స్ నుంచి కంటెంట్ను జియో ఫోన్ యూజర్లు పొందవచ్చు.

గతేడాది జూలైలో ..
కాగ, గతేడాది జూలైలో కంపెనీ తన జియోఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రూ.1500 డిపాజిట్ చేసి, ఈ ఫోన్ను పొందవచ్చు. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని జియో రీఫండ్ చేయనుంది.


Click it and Unblock the Notifications








