ఈ ఫోన్ ధర రూ 1150, సిమ్ కార్డ్ ఇంకా 1000 నిమిషాల టాక్టైమ్ ఉచితం
జీవీ మొబైల్స్ (Jivi Mobiles)తన తొలి సీడీఎమ్ఏ ఫీచర్ ఫోన్ను దేశీయ విపణిలో ఆవిష్కరించింది. పేరు ‘జీవీ జేవీ సీ200'. ధర రూ.1150. 1000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉన్న ఈ హ్యాండ్సెట్లోని బ్యాటరీ 4.5 గంటల టాక్టైమ్ను ఇవ్వగలదు. ఈ ఎంట్రీ-లెవల్ ఫోన్లో 1500 కాంటాక్ట్లతో పాటు 500 సేందేశాలను భద్రపరచుకోవచ్చు. 4జీబి మెమరీ కార్డ్ను సపోర్ట్ చేస్తుంది. మొబైల్ను మైక్రోయూఎస్బీ పోర్ట్ ద్వారా పర్సనల్ కంప్యూటర్కు జతచేసి మోడెమ్లా ఉపయోగించుకోవచ్చు.

ఈ ఫోన్ కొనుగోలు పై రిలయన్స్ మొబైల్ నెట్వర్క్ కనెక్షన్తో పాటు 1000 నిమిషాల రిలయన్స్ టూ రిలయన్స్ టాక్టైమ్ను ఉచితంగా పొందవచ్చు. త్వరపడండి మరి......


Click it and Unblock the Notifications







