మూడు స్క్రీన్ల ఫోన్ తో దిగ్గజాలకి షాక్ ఇవ్వడానికి రెడీ అయిన షియోమి
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమి ఈ ఏడాది మొబైల్ రంగంలో సరికొత్త స్టెప్ని తీసుకుంటూ ముందుకు దూసుకెళుతోంది
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమి ఈ ఏడాది మొబైల్ రంగంలో సరికొత్త స్టెప్ని తీసుకుంటూ ముందుకు దూసుకెళుతోంది.త్వరలో మూడు స్క్రీన్ల స్మార్ట్ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తునట్టు తెలుస్తుంది .అయితే దీనిపై షియోమి సంస్థ ఎటువంటి అధికారిక సమాచారాన్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో షియోమి నుంచి రాబోతున్న 3స్క్రీన్ ఫోన్ యొక్క వీడియో లీక్ అయింది.
ఈ వీడియోను చూసాక షియోమి మూడు స్క్రీన్ల ఫోన్ మీద వర్క్ చేస్తునట్టు తెలుస్తుంది.ఈ ఏడాది శాంసంగ్ మరియు హువాయి కూడా తమ ఫోల్డబుల్ టైప్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాయి.ఒకసారి ఆ ఫోన్ల యొక్క విశేషాలు చూడండి...

శాంసంగ్ విన్నర్...
శాంసంగ్ విన్నర్, 4 అంగుళాల స్క్రీన్ తో రాబోతోంది. 200 గ్రాముల బరువును కలిగి ఉండే ఈ ప్రోటోటైప్ డివైస్లో బెండింగ్ మెకనిజం కారణంగా ఇన్-స్ర్కీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఉండదట. గెలాక్సీ ఎస్10తో పాటు ఈ ప్రోటోటైప్ డివైస్ను ప్రదర్శించే అవకాశముందని తెలుస్తోంది.

హువాయి నుంచి ఫోల్డబుల్ టైప్ స్మార్ట్ఫోన్..
ఫోల్డబుల్ టైప్ స్మార్ట్ఫోన్ల పై పరిశోధనలు ముమ్మరమవుతోన్న నేపథ్యంలో చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ హువాయి , ఓ ఫోల్డబుల్ టైప్ స్మార్ట్ఫోన్ పై వర్క్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్మార్ట్ఫోన్ను ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ల్యాప్టాప్లతో పోటీపడే సత్తా..
తాము అభివృద్థి చేస్తోన్న ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చినట్లయితే ల్యాప్టాప్లు పూర్తిగా కనుమరుగు అయిపోతాయని అన్నారు. స్మార్ట్ఫోన్లు చిన్న చిన్న స్క్రీన్ లను కలిగి ఉండటం కారణంగా ల్యాప్టాప్ల హవా ఇంకా కొనసాగుతోందని, బెండబుల్ ఫోన్ల రాకతో ఆ పరిస్థితి మారిపోబోతోందని ఆయన తెలిపారు. ఫోల్డబుల్ టైప్ స్మార్ట్ఫోన్లలో ఎక్కువ స్ర్కీన్ను ప్రొవైడ్ చేసే వీలుండటంతో ఇవి ల్యాప్టాప్లతో సమానంగా పనచేయగలుగుతాయట.


Click it and Unblock the Notifications








