దోమల్ని తరిమేసే స్మార్ట్ఫోన్ రూ. 7,990కే
దోమలను తరమడానికి జెట్ కాయిల్స్ను, బాడ్మింటన్ రాకెట్స్ను ఉపయోగించి ఉంటాం. కానీ ఇప్పుడు దోమలకు తరిమేసే స్మార్ట్ఫోన్లు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి.
దోమలను తరమడానికి జెట్ కాయిల్స్ను, బాడ్మింటన్ రాకెట్స్ను ఉపయోగించి ఉంటాం. కానీ ఇప్పుడు దోమలకు తరిమేసే స్మార్ట్ఫోన్లు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. ప్రముఖ మొబైల్ హ్యాడ్సెట్స్ తయారీ కంపెనీ ఎల్జీ తాజాగా ఇలాంటి ఫీచర్తో 'కే7ఐ' అనే స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

దీని ధర రూ.7,990. మస్కిటో అవే టెక్నాలజీతో ఈ ఫోన్ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో మస్కిటో అవే అనే ఫీచర్ను ఏర్పాటు చేశారు. దీంతో ఫోన్ వెనుక భాగంలో అమర్చిన ప్రత్యేక ప్యానెల్ నుంచి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ వస్తాయి.

అవి దోమలను తరిమేస్తాయి. అయితే ఈ తరంగాలు మానవులకు మాత్రం హాని చేయవని ఎల్జీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఈ ఫోన్లో 5 అంగుళాల డిస్ప్లే, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించింది. కాగా కంపెనీ ఇప్పటికే పలు టీవీలు, ఏసీలలో ఈ టెక్నాలజీని పొందుపరిచింది.

ఎల్జీ కే7ఐ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్టీఈ, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








