చైనా కంపెనీకి దిమ్మతిరిగే షాకివ్వబోతున్న ఇండియా దిగ్గజం !
దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజానికి మైక్రోమ్యాక్స్ రూపంలో పెనుముప్పు ఎదురుకానుందని తెలుస్తోంది.
దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజానికి మైక్రోమ్యాక్స్ రూపంలో పెనుముప్పు ఎదురుకానుందని తెలుస్తోంది. షియోమి దేశ్ కా స్మార్ట్ఫోన్ అంటూ విడుదల చేసిన షియోమి రెడ్మి 5ఎని టార్గెట్ చేస్తూ మైక్రోమ్యాక్స్ తన భారత్ 5 ప్లస్ ని రంగంలోకి దించేందుకు రెడీ అయింది. కాగా ఈ ఫోన్లో రెడ్మి 5ఎని తలదన్నే ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. అతి త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

మైక్రోమ్యాక్స్ భారత్ 5 ప్లస్ ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర, లాంచ్ వివరాలను..
అయితే దీని ధర, లాంచ్ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మైక్రోమ్యాక్స్ అఫిషియల్ వెబ్సైట్లో ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను ప్రవేశపెట్టింది. కాగా Micromax, Bharat 5 డింసెబర్ లో విడుదలయిన విషయం అందరికీ తెలిసిందే.

మైక్రోమ్యాక్స్ భారత్ 5 ఫీచర్లు
ఈ ఫోన్ ధరను కంపెనీ రూ. 5, 555గా నిర్ణయించింది. అన్ని రీటెయిల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
మైక్రోమ్యాక్స్ భారత్ 5 ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమి రెడ్మి 5ఎ ఫీచర్లు
షియోమి దేశ్ కా స్మార్ట్ఫోన్ రెడ్మి 5ఎ ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా పరిమిత సంఖ్యలో మాత్రమే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
షియోమి రెడ్మి 5ఎ ఫీచర్లు
5-inch 720p IPS LCD display
2/3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి విస్తరణ సామర్ధ్యం,
13 ఎంపీ కెమెరా, 1080 ఫిక్సల్ తో వీడియో షూట్ సామర్ధ్యం
5 ఎంపీ సెల్ఫీ షూటర్
Android Nougat-based MIUI 9
3,000mAh battery
dual-SIM phone supports
4G LTE, VoLTE and USB OTG.

ధర రూ. 5,999
2 జిబి ర్యామ్ ధర రూ. 4,999 కాగా 3 జిబి ర్యామ్ ధరను కంపెనీ రూ. 6999గా నిర్ణయించింది. అయితే 50 లక్షల యూనిట్లు మాత్రమే మొదటి దశలో అమ్మకాలు జరుగుతాయి. ఆ తరువాత 2 జిబి ర్యామ్ ఫోన్ ధర రూ. 5,999గా ఉంటుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








