ఆన్లైన్లో ప్రత్యక్షమైన మైక్రోమాక్స్ సరికొత్త స్మార్ట్ఫోన్
మధ్య ముగింపు స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన పట్టుసాధించిన మైక్రోమాక్స్ మరో మధ్య ముగింపు స్మార్ట్ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది. ‘కాన్వాస్ 2.2 ఏ114' పేరుతో మైక్రోమాక్స్ నుంచి విడుదల చేయబోతున్న ఈ స్మార్ట్ఫోన్ వివరాలను ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ ఫ్లిప్కార్ట్ తన లిస్టింగ్స్లో పొందుపరిచింది. ఫోన్ ధర రూ.12,999.

ఫోన్ ప్రత్యేకతలు:
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్ప్లే(రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్-కోర్ ప్రాసెసర్ (ఎంటీ6582ఎమ్),
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (7 గంటల 2జీ టాక్టైమ్తో).
ఇతర ఫీచర్లు: 3జీ, డ్యూయల్ సిమ్ (మైక్రోసిమ్ సపోర్ట్) , వై-ఫై, బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో.
ఈ వారంలోనే అధికారిక విడుదల:
కాన్వాస్ 2.2 ఏ114 స్మార్ట్ఫోన్ను మైక్రోమాక్స్ వర్గాలు ఈ వారంలోనే విడుదల చేసే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. మరిన్నీ అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి తెలుగు గిజ్బాట్...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








