ఆ కొత్త ఫార్ములా తలరాతను మార్చేస్తుందా..?

భవిష్యత్ ప్రణాళికలో భాగంగా మైక్రోమ్యాక్స్ , ప్రాసెసర్ల తయారీ సంస్థ మీడియా టెక్ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మీడియా టెక్ సమకూర్చే డ్యూయల్ కోర్ ప్రాసెసర్లను తాము రూపొందించే తక్కువ ధర (10,000కు దిగువ ధర) స్మార్ట్ఫోన్లలో వినియోగించేందుకు మైక్రోమ్యాక్స్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. తాజాగా ఈ చిప్మేకర్ ఎమ్ టి6577 పేరుతో డ్యూయల్ కోర్ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించింది. 1 గిగాహెట్జ్ సామర్ధ్యం గల డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్ను ఒదిగి ఉన్నఈ ప్లాట్ఫామ్
ఆండ్రాయిడ్ ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం అదేవిధంగా 3G/HSPA+”>HSPA మోడెమ్లకు అనుకూలంగా వ్యవహరిస్తుంది.
మీడియో టెక్ రూపొందించిన ఈ డ్యూయల్ కోర్ చిప్సెట్ ఉత్తమ పనితీరుతో కొత్త తరహా అనుభూతికిలోను చేస్తుంది. ఈ చిప్సెట్ వినియోగం వల్ల మొబైల్ కనెక్టువిటీ, యూజర్ ఇంటరాక్టివిటీ, మల్టీమీడియా వంటి అంశాలు మరింత మెరుగైన పనితీరును ప్రదర్శిస్తాయి.
ఎమ్టి6577 డ్యూయల్ కోర్ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేసే అంశాలు:
8 మెగాపిక్సల్ కెమెరా,
హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్ (1080 పిక్సల్),
హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ (720 పిక్సల్),
డ్యూయల్ బ్యాండ్ 802.11n వై-ఫై,
బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ.
ఈ చిప్సెట్ ఆధారితంగా పనిచేసే తొలి స్మార్ట్ఫోన్ మరో మూడు నెలలో మార్కెట్లో లభ్యం కానుంది. దేశీయ బ్రాండ్లైన మైక్రోమ్యాక్స్, లావా, స్పైస్ తదితర సంస్థలకు మీడియా టెక్ ప్రాసెసర్లను సరఫరా చేస్తుంది.


Click it and Unblock the Notifications